ETV Bharat / state

కరోనా భయం: ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్నా.. పట్టించుకోని జనం..

author img

By

Published : Jul 17, 2020, 11:50 AM IST

People who don’t care about the person for fear of corona in kamareddy district
కరోనా భయం: ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్నా.. పట్టించుకోని జనం..

కరోనా మహమ్మారి మానవత్వాన్ని సైతం మరిచేలా చేస్తోంది. రోడ్డుమీద ఊపిరాడక ఓ వ్యక్తి విలవిలాడుతుంటే.. కరోనా ఉందేమోననే భయంతో ఎవరు అతని దగ్గరుకు పోలేదు. చివరకు ఆర్టీసీ అధికారుల చొరవతో అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలించారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్​లో దారుణం చోటుచేసుకుంది. బస్టాండ్​లో బస్సు దిగి బయటకు వస్తూ... ఓ వ్యక్తి కిందపడి శ్వాస ఆడక కొట్టుమిట్టాడాడు. అటు నుంచి చాలా మంది వెళ్లినా.. కరోనా భయంతో పట్టించుకోలేదు.

సుమారు గంటపాటు శ్వాస తీసుకోవడంలో ఆ వ్యక్తి ఇబ్బంది పడ్డాడు. చివరకు ఆర్టీసీ అధికారుల చొరవతో 108 అంబులెన్స్​లో కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇబ్బంది పడ్డ వ్యక్తిది మెదక్​ జిల్లా బూరుగుపల్లి గ్రామానికి చెందిన హన్మంతు(55)గా గుర్తించారు.

ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.