ETV Bharat / state

ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలి: కలెక్టర్​ శరత్​

author img

By

Published : Jan 13, 2021, 1:45 PM IST

kamareddy collector
ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలి: కలెక్టర్​ శరత్​

కామారెడ్డి కలెక్టర్​ శరత్​ భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటలు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ శరత్ పాల్గొని భోగి మంటను వెలిగించారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని పాలనాధికారి సూచించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ చందర్ నాయక్, ఆర్డీఓ శ్రీను, తహసీల్దార్ అమిన్ సింగ్, జాగృతి అధ్యక్షులు అనంత రాములు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవీచూడండి: తెలుగు లోగిళ్లలో భోగి భాగ్యాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.