ETV Bharat / state

కుటుంబసమేతంగా పుష్కరాల్లో పాల్గొన్న నాగర్​కర్నూల్​ ఎంపీ

author img

By

Published : Dec 1, 2020, 8:53 PM IST

Nagar Kurnool MP oparticipated in Tungabhadra Pushkar in jogulamba gadwal dist
కుటుంబసమేతంగా పుష్కరాల్లో పాల్గొన్న నాగర్​కర్నూల్​ ఎంపీ

తుంగభద్ర పుష్కరాలు చివరిరోజు కావడంతో నాగర్​కర్నూల్​ ఎంపీ పోతుగంటి రాములు కుటుంబసమేతంగా పాల్గొన్నారు. ఆలంపూర్ పుష్కర ఘాట్​లో పుణ్యస్నానాలు ఆచరించి జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు శేషవస్త్రంతో ఎంపీని సత్కరించారు.

జోగులాంబ గద్వాల జిల్లా లో జరుగుతున్న తుంగభద్ర పుష్కరాలు చివరిరోజు కావడంతో నాగర్​కర్నూల్​ ఎంపీ పోతుగంటి శ్రీరాములు పాల్గొన్నారు. కుటుంబసమేతంగా ఆలయ సమీపంలోని పుష్కరఘాట్​లో పుణ్యస్నానాలు ఆచరించారు.

అనంతరం ఆలయంలోని జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఎంపీని శేష వస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రహం, దేవాలయ ఛైర్మన్ రవిప్రకాశ్ గౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ముగిసిన గ్రేటర్​ పోలింగ్.. ‌ఎల్లుండి ఓల్డ్‌ మలక్‌పేటలో రీపోలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.