ETV Bharat / state

''అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం' .. వ్యాయామంతోనే పరిపూర్ణ ఆరోగ్యం''

author img

By

Published : Jan 14, 2021, 12:25 PM IST

jogulamba gadwala, alampur, 10k run
జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్, 10కె రన్​

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో ఫిట్​ ఇండియా ఆధ్వర్యంలో పరుగు పందెం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్​ కుమార్​ పాల్గొన్నారు. పది కిలోమీటర్ల దూరాన్ని 53 నిమిషాల్లో పూర్తి చేసి అందరినీ ఉత్సాహపరిచారు.

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో స్వేరో సంబరాల్లో భాగంగా ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో పరుగు పందెం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్​ పాల్గొన్నారు. ఉండవల్లి మండలం భైరపురం గ్రామం నుంచి అలంపూర్​లోని స్వేరో పైలాన్ వరకు నిర్వహించిన 10కె రన్​​లో ప్రవీణ్ కుమార్ పాల్గొని అందరినీ ఉత్సాహ పరిచారు. 10 కిలోమీటర్ల దూరాన్ని 53 నిమిషాలలో పూర్తి చేశారు.

అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం అనే నినాదంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఆయన తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని సూచించారు. తాను 30ఏళ్లుగా వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు.

ఇదీ చదవండి: అప్పుడే.. యాదాద్రి ప్రధానాలయ ప్రారంభోత్సవం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.