ETV Bharat / state

'ఆర్డీఎస్​ కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే'

author img

By

Published : Dec 13, 2020, 4:34 PM IST

Alamapur  abraham MLA inspects RDS canal in jogulamba gadwal dist
'ఆర్డీఎస్​ కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే'

ఆర్డీఎస్​ కాలువకు గండి పడగా ఆలంపూర్ ఎమ్మెల్యే తనిఖీ చేశారు. అధికారులతో మాట్లాడి తక్షణమే మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. నీట మునిగిన వరిపంటను పరిశీలించి రైతులను ఆదుకుంటామని తెలిపారు.

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం సిందనూర్​ వద్ద ఆర్డీఎస్ 12వ​ కాలువకు గండి పడగా అలంపూర్ ఎమ్మెల్యే డా.అబ్రహం పరిశీలించారు. అధికారులు పట్టించుకోకపోవటం వల్ల వంద ఎకరాలకు పైగా పంట నీటమునిగింది. వెంటనే కాలువకు మరమ్మతులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

అనంతరం నీటమునిగిన వరి పంటపొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. చేతికొచ్చిన పంట నీట మునిగి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:తీగల వంతెన నిర్మాణంతో నెలకొన్న సరికొత్త వివాదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.