ETV Bharat / state

'పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ లక్ష్యంగా సేవలందిస్తాం'

author img

By

Published : Jan 1, 2021, 5:26 PM IST

Sangram Singh Patil wishes you a Happy New Year
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెపిన సంగ్రామ్ సింగ్ పాటిల్

నూతన సంవత్సర వేడుకలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాదిలో ప్రజలకు మరింత మెరుగైన సేవలదింస్తామని ఇంఛార్జ్ ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ పాటిల్ అన్నారు. పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.

నూతన సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలందిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ పాటిల్ అన్నారు. ఈ ఏడాదిలో నేర రహిత, ప్రమాదాల నివారణ, మహిళా భద్రత, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు.

నూతన సంవత్సర వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ప్రజలందరికీ ఇంఛార్జ్ ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదిలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.

పోలీస్ శాఖ ఎప్పుడూ ప్రజా సేవలో ఉంటుంది. కరోనా వ్యాప్తి క్లిష్ట పరిస్ధితిల్లోనూ ఆందోళన చెందకుండా ముందుండి జిల్లా పోలీసు యంత్రాంగం సమిష్టి కృషి చేసింది. అదే స్పూర్తితో ఈ ఏడాదిలో మరింత మెరుగైన ఫలితాలను సాధిస్తాం.

-డా.సంగ్రామ్ సింగ్ పాటిల్, జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ

వేడుకల్లో.. అడిషనల్ ఎస్పీ వి.శ్రీనివాసులు, ఏఆర్​ అదనపు ఎస్పీ సదానంద రెడ్డి, శిక్షణ ఐపీఎస్ సుధీర్ రామ్​నాథ్ కేకన్, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు ఏ.సంపత్ రావు, బోనాల కిషన్, సీఐలు, ఎస్సైలు, డీపీఓ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ప్రజలకు మరింత చేరువై మన్ననలు పొందాలి: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.