ETV Bharat / state

ఖాతాల్లో పెట్టుబడి సాయం... ఆనందంలో రైతులు

author img

By

Published : Jun 17, 2021, 4:10 PM IST

రైతు బంధు పథకంతో అన్నదాతలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల రైతులు పేర్కొన్నారు. రైతు బంధు డబ్బులు ఖాతాల్లో జమ అవుతోన్న నేపథ్యంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

రైతు బంధు పథకం
రైతు బంధు పథకం

పెట్టుబడి సాయంగా అందించే రైతు బంధు డబ్బులు ఖాతాల్లో జమకానుండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామంలో ఎంపీపీ పుణ్ణం లక్ష్మీ రవి ఆధ్వర్యంలో రైతులు... సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే దంపతులు గండ్ర వెంకటరమణ రెడ్డి, జ్యోతి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

సీమాంధ్ర పాలనలో రైతులను పట్టించుకున్న నాథుడే లేడని ఎంపీపీ పుణ్ణం లక్ష్మీ రవి అన్నారు. రైతులను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వమని కొనియాడారు. రైతుకు ఉచిత కరెంట్, రైతుబీమా, నాణ్యమైన విత్తనాలతో అనేక పథకాలు ప్రవేశపెట్టి... ఆదుకుంటోందని తెలిపారు

ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు కిషన్ రావు, యూత్ అధ్యక్షుడు మోరే నరేశ్‌,జిల్లా నాయకులు బండి రమేశ్‌ గౌడ్, కొమురయ్య, ప్రభాకర్, గుండెకరి సంజీవ రావు, శ్రీపతి రవీందర్, చెలిక రవి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'పేదవాడు... కాలుమీద కాలేసుకుని బతకాలన్నదే సీఎం ఆశయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.