జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారంలో ఇసుక డంపులపై పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. గోదావరి తీరంలో ఇళ్ల వెనకాల నిల్వ ఉంచిన భారీ ఇసుక నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రదేశాల్లో మొత్తం 380 ఇసుక ట్రిప్పులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న ఇసుకను రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.
ఇవీ చూడండి: 'హార్దిక్ను 2 వారాలు నాకు వదిలేయండి..'