ETV Bharat / state

మెట్​పల్లి తహసీల్దార్​ కార్యాలయంలో కలెక్టర్​ రవి ఆకస్మిక తనిఖీ

author img

By

Published : Nov 4, 2020, 7:16 PM IST

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్​, ఆస్తి మార్పిడిలో సత్వర సేవలను అందించేందుకే ప్రభుత్వం ధరణి పోర్టల్​ ప్రవేశపెట్టిందని జగిత్యాల జిల్లా కలెక్టర్​ గుగులోత్​ రవి అన్నారు. మెట్​పల్లి తహసీల్దార్​ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆయన రైతులకు పాసు పుస్తకాలు, రిజిస్ట్రేషన్​ పత్రాలను అందజేశారు.

jagitial collector guguloth ravi inspected metpalli mro office
మెట్​పల్లి తహసీల్దార్​ కార్యాలయంలో కలెక్టర్​ రవి ఆకస్మిక తనిఖీ

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని తహసీల్దార్​ కార్యాలయాన్ని కలెక్టర్​ గుగులోత్​ రవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో జరుగుతున్న భూముల రిజిస్ట్రేషన్​ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం పలువురు రైతులకు పాసు పుస్తకాలు, రిజిస్ట్రేషన్​ పత్రాలను అందజేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్​ ద్వారా ప్రజలకు పారదర్శకంగా, సులభతరంగా సేవలు అందుతాయని కలెక్టర్​ వివరించారు.

జిల్లాలోని అన్ని తహసీల్దార్​ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్​లకు పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియను ప్రారంభించామని గుగులోత్​ రవి తెలిపారు. భూముల క్రయవిక్రయాలు, లావాదేవీలు బయోమెట్రిక్​ ఆధారంగా జరుగుతున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 186 మీ-సేవ కేంద్రాలున్నాయని.. ఆయా కేంద్రాల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సేవలు పొందవచ్చని ఆయన వివరించారు.

ఇదీ చదవండి: 'కరోనా నియంత్రణలో వచ్చే మూడు నెలలు అత్యంత కీలకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.