ETV Bharat / state

గుట్రాజ్​పల్లిలో చెక్​డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన

author img

By

Published : May 3, 2021, 2:14 PM IST

వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టేందుకు చెక్ డ్యాంలు ఉపయోగపడతాయని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల గ్రామీణ మండలం గుట్రాజ్​పల్లి వాగుపై చెక్​డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

jagtial district news, jagtial mla sanjay kumar, check dam in jagtial
జగిత్యాల జిల్లా వార్తలు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జగిత్యాలలో చెక్ డ్యాం

జగిత్యాల జిల్లా గుట్రాజ్​పల్లిలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పర్యటించారు. గుట్రాజ్​పల్లి వాగుపై చెక్​డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ నిర్వహించారు.

వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టేందుకు చెక్​ డ్యాంలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే అన్నారు. వీటిద్వారా భూగర్భ జలాలు పెరగడమే కాకుండా రైతులకు సాగునీరు అందుతుందని తెలిపారు. తెలంగాణ సర్కార్ తాగు, సాగునీటికి అధిక ప్రాధాన్యమిస్తుందని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.