ETV Bharat / state

పండుగ పూట విషాదం... యువ దంపతుల బలవన్మరణం

author img

By

Published : Jan 16, 2020, 12:24 PM IST

Updated : Jan 16, 2020, 12:50 PM IST

పండుగ పూట సంతోషంగా గడపాల్సిన ఆ దంపతులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నెలల పసిగుడ్డును వదిలేసి దేవుని దగ్గరకు పయనమయ్యారు. ఆర్థిక ఇబ్బందులనే తాత్కాలిక సమస్యకు... చావే శరణ్యమని శాశ్వత పరిష్కారాన్ని వెతికారు.

young couple committed suicide due to financial problems at boduppal in hyderabad
యువ దంపతుల బలవన్మరణం... ఆర్థిక ఇబ్బందులే కారణం!

యువ దంపతుల బలవన్మరణం... ఆర్థిక ఇబ్బందులే కారణం!

హైదరాబాద్​ మేడిపల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో పండుగ పూట దారుణం చోటు చేసుకుంది. బోడుప్పల్​లోని సాయిరాం కాలనీలో ఉంటున్న యువ దంపతులు అక్షత్​(26), చైతన్య(24) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఏపీలోని కడప జిల్లా చంపాడు గ్రామానికి చెందిన ఈ దంపతులు జీవనోపాధి కోసం బోడుప్పల్​ వచ్చారు. అందరూ సంక్రాంతి సంబురాల్లో ఉన్న వేళ.. వారు తనువు చాలించారు. వీరికి నెల వయస్సు గల కూతురు ఉంది. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Intro:HYD_tg_09_16_Boduppal_Susciide_av_TS10026
కంట్రిబ్యూటర్‌: ఎఫ్‌.రామకృష్ణాచారి(ఉప్పల్‌)

( ) హైదరాబాద్‌ మేడిపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో పండుగ వేళ దారుణం చోటు చేసుకుంది. ఆర్థిక
ఇబ్బందులు భరించలేక యువ దంపతులు ఆత్యహత్య చేసుకున్నారు. బోడుప్పల్ లోని సాయిరాం
కాలనీలో ఉంటున్న అక్షత్(26M), చైతన్య(24F) అనే భార్యాభర్తలు ఆత్మహత్య,

వీరి స్వగ్రామం కడప
జిల్లా చంపాడు గ్రామం జీవనోపాధిక కోసం బోడుప్పల్‌కు వచ్చి నివాసం ఉంటున్నారు. వీరికి ఒక నెల
రోజుల కూతురు ఉంది. ఫ్యాన్‌కు చీర సహాయంతో దంపతులు ఉరివేసుకున్నారు. స్థానికుల ద్వార
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆర్ధిక ఇబ్బందులే
ఆత్మహత్య కి కారణం కావొచ్చనే అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు
చేస్తున్నామని, మృతుల బంధువులకు సమాచారం అందిచినట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు.Body:Chary,uppalConclusion:9848599881
Last Updated :Jan 16, 2020, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.