ETV Bharat / state

ఆగని వరద.. నిండుకుండలా మారిన జలాశయాలు

author img

By

Published : Aug 23, 2020, 1:49 PM IST

ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో రాష్ట్రంలోని జలాశయాలు నిండుకుండలా మారాయి. వరద ప్రవాహంతో కృష్ణా నది ఉప్పొంగుతోంది. శ్రీశైలం జలాశయానికి ప్రవాహం తగ్గటం లేదు. ప్రాజెక్టుల్లో వరద తీవ్రతను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

water-levels-in-projects-in-state
ఆగని వరద.. నిండుకుండలా మారిన జలాశయాలు

ఎగువ నుంచి వస్తున్న నీటితో కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. బేసిన్‌లో జలాశయాలు నిండుకుండలా మారాయి.

శ్రీశైలం జలాశయానికి తగ్గని ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గట్లేదు. ప్రస్తుతం 3 లక్షల 98 వేల 780 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.20 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 205.66 టీఎంసీలకు చేరింది. వరదకు అనుగుణంగా.. 4 లక్షల 35 వేల 546 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.

పూర్తిగా నిండిన తుంగభద్ర

తుంగభద్ర జలాశయం వరద నీటితో పూర్తిగా నిండిపోయింది. ఇన్‌ఫ్లో 33,566 క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 20,653 క్యూసెక్కులుగా ఉంది. జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1632.92 అడుగులుగా ఉంది. నీటి నిల్వకు సంబంధించి పూర్తిస్థాయి సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 100.55 టీఎంసీలుగా ఉంది.

ఆల్మట్టిలో..

ఆల్మట్టి డ్యాం పూర్తిగా నిండిపోయింది. ఇన్‌ఫ్లో 2,59,653 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 2,24,839 క్యూసెక్కులుగా అధికారులు తెలిపారు.

సాగర ఘోష

ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 3,73,769 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 587.50 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 305.80 టీఎంసీలకు చేరింది.

ఇదీ చదవండి: ప్రాజెక్టులకు భారీగా వరద.. కొనసాగుతున్న నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.