ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన అనంతగిరి మండలం పిన్నకోట పంచాయతీ కరకవలస గిరిజనులు.. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుక్కెడు నీళ్ల కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
గ్రామంలో కొందు తెగకు చెందిన 18 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. మంచి నీటి అవసరాలు తీర్చేందుకు ఏర్పాట్లు చేసినా... ఆ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. అప్పటి నుంచి వీరు గొంతు తడుపుకోవాలంటే.. గుర్రాలకు బిందెలు కట్టి... కిలో మీటర్ల దూరం ప్రయాణించక తప్పటం లేదు. సరైన మార్గం సైతం లేక కొండలు, గుట్టల ద్వారా ప్రయాణించి... మంచినీటిని తెచ్చుకుంటున్నారు. తమ అవస్థలపై స్పందించి... తాగునీటి కష్టాలు తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: మంజీరా పైప్లైన్ పగిలి నీరు వృథా...