ETV Bharat / state

తాగునీటికి కటకట... అశ్వాల సాయంతో కిలోమీటర్ల నడక!

author img

By

Published : Dec 30, 2020, 3:10 PM IST

మంచి నీటి కోసం బిందెలను గుర్రాలపై పెట్టుకొని వెళ్తున్నారు... ఇదేదో ఎడారి ప్రాంతమని అనుకుంటే మీరు పొరబడినట్లే. ఏపీలోని విశాఖ మన్యంలోని ప్రజలు తాగు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. అవును మీరు చదివింది నిజమే. గిరిజనులకు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందంటే...

water-carry-with-horses-at-karakavalasa-in-visakha-agency
మన్యంలో తాగునీరుకి కటకట... అశ్వాల సాయంతో కిలోమీటర్ల నడక!

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన అనంతగిరి మండలం పిన్నకోట పంచాయతీ కరకవలస గిరిజనులు.. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుక్కెడు నీళ్ల కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

మన్యంలో తాగునీరుకి కటకట... అశ్వాల సాయంతో కిలోమీటర్ల నడక!

గ్రామంలో కొందు తెగకు చెందిన 18 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. మంచి నీటి అవసరాలు తీర్చేందుకు ఏర్పాట్లు చేసినా... ఆ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. అప్పటి నుంచి వీరు గొంతు తడుపుకోవాలంటే.. గుర్రాలకు బిందెలు కట్టి... కిలో మీటర్ల దూరం ప్రయాణించక తప్పటం లేదు. సరైన మార్గం సైతం లేక కొండలు, గుట్టల ద్వారా ప్రయాణించి... మంచినీటిని తెచ్చుకుంటున్నారు. తమ అవస్థలపై స్పందించి... తాగునీటి కష్టాలు తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: మంజీరా పైప్​లైన్​ పగిలి నీరు వృథా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.