ETV Bharat / state

Twin Towers for HODs near TS Secretariat : సచివాలయ సమీపంలో హెచ్​ఓడీలకు 'ట్విన్ టవర్స్'

author img

By

Published : May 30, 2023, 8:37 AM IST

Twin Towers for HODs near TS Secretariat : సచివాలయం సమీపంలోని ఆదర్శనగర్​లో ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాల సముదాయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యే క్వార్టర్స్, రిట్జ్ హోటల్ స్థలాల్లో జంట టవర్లు నిర్మించవచ్చని అంటున్నారు. స్థల నిర్ధరణ అనంతరం కొంత సమయం తీసుకొని ప్రక్రియను ప్రారంభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

CM KCR
CM KCR

త్వరలో సచివాలయ సమీపంలో జంట క్వార్టర్స్​

Twin Towers for HODs near TS Secretariat : సమీకృత సచివాలయ భవన ప్రారంభోత్సవం పూర్తయి కార్యకలాపాలు కొనసాగుతున్న తరుణంలో మరో భారీ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు అన్నింటినీ ఒకే చోట నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం వివిధ హెచ్ఓడీ కార్యాలయాలు రాజధాని నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి.

HODs Twin Towers near Telangana Secretariat : బొగ్గులకుంట, కోటి, నాంపల్లి, హిమాయత్​నగర్, మలక్​పేట్, విజయనగర్ కాలనీ, మాసబ్ ట్యాంక్, వెంగళరావు నగర్, ఖైరతాబాద్, లక్డీకపూల్, అమీర్​పేట్, సికింద్రాబాద్ ఇలా నగరంలోని పలు చోట్ల ఈ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాలు అన్నింటికీ నిత్యం సచివాలయంతో సంప్రదింపులు అవసరం ఉంటుంది. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తరచూ వస్తూపోతూ ఉంటారు. దీంతో హెచ్ఓడీ కార్యాలయాలు అన్నింటినీ సచివాలయానికి దగ్గరగానే ఒకే చోట నిర్మించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు.

Twin Towers near Telangana Secretariat : అన్ని విభాగాధిపతుల కార్యాలయాలు కలిపి 11 నుంచి 12 వేల మంది వరకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఉంటారని ప్రాథమిక అంచనా. ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగులు పని చేసేలా, అన్ని కార్యాలయాలకు సరిపడేలా 40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం మేర భవన నిర్మాణం అవసరం ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన సచివాలయ ప్రధాన భవనం ఎనిమిదిన్నర లక్షల చదరపు అడుగులకు పైగా ఉంది.

CM KCR Plans To Build New HOD offices Near Secretariat : హెచ్ఓడీ కార్యాలయాల కోసం దాదాపు ఐదు సచివాలయాల అంత విస్తీర్ణం అవసరం. అంత ఎక్కువ విస్తీర్ణం అవసరం అయినందున జంట టవర్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందుకు భారీ స్థలం కూడా అవసరం. సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాల గురించి సీఎం ఆరా తీశారు. ఆదర్శనగర్​లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, సమీపంలో ఉన్న రిట్జ్ హోటల్ ప్రాంతాలతో పాటు ఎల్బీ స్టేడియం పరిసరాలు, పాటిగడ్డలోని ప్రభుత్వ క్వార్టర్ల ఉన్న ప్రాంతం తదితరాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం హిమాయత్​నగర్​ లో కొత్త క్వార్టర్లు నిర్మించిన నేపథ్యంలో ఆదర్శనగర్ క్వార్టర్స్ చాలావరకు నిరుపయోగంగా ఉన్నాయి. అందులో చాలా వాటి పరిస్థితులు ఇబ్బందికరంగానే ఉన్నాయి. రిట్జ్​హోటల్ ప్రాంతం ఖాళీగానే ఉండడంతో సినిమా షూటింగులు జరుగుతున్నాయి. పాటిగడ్డ క్వార్టర్స్ పాత బడ్డాయి. చాలా క్వార్టర్స్​లో ఎవరూ ఉండడం లేదు.

సచివాలయానికి సమీపంలోనే ఉండాలన్న భావనతో ఆదర్శనగర్​లోనే హెచ్ఓడీ కార్యాలయాల నిర్మాణం చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు. అవకాశం ఉన్న అన్ని స్థలాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని, ట్రాఫిక్ తదితర అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. స్థల నిర్ధరణ అయిన తర్వాత జంట టవర్లను నిర్మించాలని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. ఆర్థిక వెసులుబాటు సహా అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రక్రియను ప్రారంభించనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.