ETV Bharat / state

Kavitha Tweet: 'తెలంగాణ ఎవరి భిక్షా కాదు'.. మాణిక్కం ఠాగూర్​కు కవిత కౌంటర్​

author img

By

Published : Feb 14, 2022, 3:32 PM IST

Updated : Feb 14, 2022, 3:50 PM IST

mlc kavitha tweet
mlc kavitha tweet

Kavitha Tweet: కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్​.. కేసీఆర్​పై చేసిన వ్యాఖ్యలను తెరాస ఎమ్మెల్సీ కవిత ఖండించారు. రాహుల్​గాంధీపై భాజపా ఎదురుదాడి చేసినప్పుడు.. రాజకీయాల్లో హుందాతనం కోసం అండగా నిలబడ్డారని గుర్తుచేశారు.

Kavitha Tweet: ఏపీ విభజనపై రాజ్యసభ వేదికగా ప్రధాని చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణలో ఇంకా రాజకీయ వేడిని రగులుస్తూనే ఉన్నాయి. రోజు ఎవరో ఒకరు.. ఏదో రూపంలో ప్రధాని వ్యాఖ్యలపై స్పందిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్​ను విమర్శిస్తే.. తెరాస నేతలు ఎందుకు స్పందిస్తున్నారంటూ... ప్రధాని వ్యాఖ్యలను భాజపా సమర్థిస్తుండగా.. కాంగ్రెస్​, తెరాస మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేస్తూ.. తెరాస మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ తీవ్ర నిరసనలు సైతం చేసింది. కాంగ్రెస్​ సైతం ఆందోళనలు చేపట్టింది.

తాజాగా ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్​ ట్వీట్​ను ఖండిస్తూ కవిత ట్వీట్​ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఎవరి భిక్షా కాదని స్పష్టం చేశారు. తెరాస నాయకత్వంలో.. ప్రజలు పోరాడి సాధించుకున్నారన్నారు. కేసీఆర్​ నేతృత్వంలో జరిగిన పోరాటంలో చివరికి సత్యమే గెలిచిందన్నారు.

మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని భాజపా అవమానిస్తే.. రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ మద్దతుగా నిలబడ్డారని కవిత పేర్కొన్నారు. రాహుల్​ గాంధీపై.. భాజపా వ్యాఖ్యలను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ వెనకబడినప్పుడు.. కేసీఆర్​ అండగా నిలిచారన్నారు. రాజకీయాల్లో హుందాతనం కోసం కేసీఆరే తొలుత స్పందించారని.. కవిత స్పష్టం చేశారు. రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలని మాణిక్కం ఠాగూర్​ను కవిత సూచించారు.

  • Just setting the record state Manickam Ji once and for all.

    KCR Garu and TRS Party led people’s movement for Telangana, it was not a GIFT. It was a FIGHT and TRUTH won. https://t.co/T1N8ru9dnv

    — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అసలు మాణిక్కం ఠాగూర్​ ఏమన్నారంటే..

అంతకుముందు తెరాస, భాజపాను విమర్శిస్తూ మాణిక్కం ఠాగూర్​​ ట్వీట్ చేశారు. లక్షల మంది తెలంగాణ యువకుల ఆకాంక్షలు, సోనియమ్మ సూచనలకనుగుణంగా పనిచేస్తామన్నారు. గత ఏడేళ్లలో జరగనిది ప్రస్తుతం జరుగుతోందని.. పార్టీ డిజిటల్​ మెంబర్​షిప్​ను ఉద్దేశించి ట్వీట్​లో పేర్కొన్నారు.​ ఊసరవెల్లి లాంటి తెరాస, మతోన్మాద పార్టీ భాజపాను ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ పని కాంగ్రెస్​ పార్టీ మాత్రమే చేయగలదన్నారు. తెరాస, భాజపాలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు వంటివని మాణిక్కం ఠాగూర్​ విమర్శించారు.

  • Team @INCTelangana will continue to work for a Telangana,
    Which millions of Telangana youth wanted..which SoniaAmma wanted..
    In 7 years it never happened..to make that happen,we need to defeat the Chameleon TRS & Communal BJP.Both are 2 sides of the same coin.Congress can &will👍 https://t.co/NQlwoMxf22

    — Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) February 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీచూడండి: విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయి: మోదీ

Last Updated :Feb 14, 2022, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.