ETV Bharat / state

Revanth Letter To KCR: 'రాష్ట్రంలో డ్రగ్స్‌ తొలి మరణం ఆందోళన కలిగించే అంశం'

author img

By

Published : Apr 1, 2022, 5:03 PM IST

Revanth Letter To KCR: నగరంలో డ్రగ్స్‌ తొలి మరణం సంభవించడం ఆందోళన కలిగిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. మత్తు మందులకు బానిసై ఇంజినీరింగ్‌ విద్యార్థి మరణించడం చాలా బాధాకరమన్నారు. ఈ ఘటన తెలంగాణ సమాజం నిర్ఘాంతపోయేలా చేసిందన్న రేవంత్‌రెడ్డి ... దీనిపై జాతీయ స్థాయిలో సిట్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.

Revanth Letter To KCR
సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ

Revanth Letter To KCR: హైదరాబాద్‌ డ్రగ్స్‌ వినియోగ కేంద్రంగా మారుతోందని ఐదేళ్లుగా చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ కారిడార్‌ ఏర్పాటు జరిగిందేమో అన్న కొత్త సందేహాలు వస్తున్నాయన్నారు. నగరంలో నానాటికి పెచ్చుమీరుతున్న డ్రగ్ మాఫియాను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎనిమిది పేజీల బహిరంగ లేఖ రాశారు.

ఇంజినీరింగ్ విద్యార్థి మరణం బాధాకరం: హైదరాబాద్‌లో డ్రగ్స్‌ భూతంతో తొలి మరణం సంభవించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. మత్తు మందుకు బానిసై 23 సంవత్సరాల ఇంజినీరింగ్‌ విద్యార్ధి మరణించడం బాధాకరమన్నారు. ఈ ఘటన తెలంగాణ సమాజాన్ని నిర్ఘాంత పోయేలా చేసిందన్న రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో మాదకద్రవ్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. డ్రగ్స్‌ భూతం ఏదొక రూపంలో పడక విప్పినప్పుడల్లా...అందులో ప్రమేయం ఉన్న రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులను కాపాడేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఎన్ని టాస్క్‌ఫోర్స్‌లు వేసినా.. ప్రత్యేక అధికారులతో పర్యవేక్షించినా డ్రగ్స్‌ మాఫియా అంతం కావడం లేదని లేఖలో పేర్కొన్నారు.

రికార్డులన్నీ తక్షణమే ఈడీకి అందజేయాలి: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డిజిటల్‌ రికార్డులన్నీ ఈడీకి అందచేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ కేసు విచారణకు జాతీయ స్థాయిలో డీఆర్‌ఐ, ఎన్‌సీబీ, ఈడీలతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకు సంసిద్ధిత వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌ ప్రధాన మంత్రికి కూడా లేఖ రాయాలని కోరారు. ఈడీ విచారణకు ఆ సంస్థ కోరిన అన్ని వివరాలు, డిజిటల్‌ రికార్డులు తక్షణమే అందచేయాలన్నారు. లేనిపక్షంలో డ్రగ్స్‌ విషయంలో తెరాస ప్రభుత్వాన్ని తొలి దోషిగా భావించాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి లేఖలో హెచ్చరించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.