ETV Bharat / state

అసోం సీఎం వ్యాఖ్యలను కేసీఆర్​ ఖండిస్తే సరిపోదు: రేవంత్​ రెడ్డి

author img

By

Published : Feb 14, 2022, 2:14 PM IST

Revanth Reddy complaint on Assam CM: కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీపై అసోం ముఖ్యమంత్రి వ్యాఖ్యల పట్ల తెలంగాణ కాంగ్రెస్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసోం సీఎంపై క్రిమినల్​ కేసు నమోదు చేసి.. వెంటనే భర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేసింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి సహా ముఖ్య నేతలు జూబ్లీహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. 48 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్​ స్టేషన్​లను ముట్టడిస్తామని రేవంత్​ హెచ్చరించారు.

Revanth Reddy complaint on Assam CM
అసోం సీఎంపై రేవంత్​ రెడ్డి ఫిర్యాదు

ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి అసోం సీఎంను అరెస్ట్‌ చేయాలి: రేవంత్​

Revanth Reddy complaint on Assam CM: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి... ఆయనను పదవి నుంచి తొలగించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాహుల్​ గాంధీపై అసోం సీఎం వ్యాఖ్యలు.. సోనియా గాంధీకి జరిగిన అవమానం మాత్రమే కాదని.. దేశంలోని మాతృమూర్తులకు జరిగిన అవమానమని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్​ స్టేషన్‌లో.. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌తో కలిసి రేవంత్​ ఫిర్యాదు చేశారు. మరోవైపు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్​ రెడ్డి.. నారాయణగూడ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అసో సీఎంకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పీఎస్​లలో ఫిర్యాదులు చేయాలని కాంగ్రెస్​ నేతలకు రేవంత్​ పిలుపునిచ్చారు.

ప్రత్యేక బృందాన్ని పంపించాలి

తెలంగాణ ఇచ్చిన సోనియాకే ఘోర అవమానం జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. అసోం సీఎం వ్యాఖ్యలను ముఖ్యమంత్రి కేసీఆర్​ ఖండిస్తే సరిపోదని.. తగిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర పోలీసు శాఖ నుంచి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అరెస్టు చేయించాలని స్పష్టం చేశారు. 48 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే.. ఈ నెల 16న అన్ని పోలీస్​స్టేషన్​లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

"అసోం సీఎంపై జూబ్లీహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాం. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయాలి. అసోం సీఎం వ్యాఖ్యలను కేసీఆర్​ ఖండించడం నిజమే అయితే.. రాష్ట్ర పోలీసు శాఖ నుంచి ప్రత్యేక బృందాన్ని పంపించి అరెస్టుకు ఆదేశించాలి. 48 గంటల్లో స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పీఎస్​ల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతాం." - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

క్షమాపణ చెప్పాలి

దేశ సంస్కృతిపై గౌవరం ఉంటే అసోం ముఖ్యమంత్రిని వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వినోద్​ రెడ్డి డిమాండ్ చేశారు. భాజపా అగ్రనాయకత్వం వెంటనే జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కమలం పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.

ఇదీ చదవండి: CM KCR Comments: కేంద్రాన్ని జైలుకు పంపేది మాత్రం పక్కా: సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.