ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@5PM

author img

By

Published : Dec 23, 2020, 4:59 PM IST

top ten news for 5pm
టాప్​టెన్​ న్యూస్​@5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

స్పందించిన ఆర్‌బీఐ

రుణ యాప్‌లపై నమోదైన కేసుల అంశంపై ఆర్‌బీఐ స్పందించింది. ఆర్‌బీఐ, ఎన్‌బీఎఫ్‌సీకి లోబడి ఉన్న సంస్థల వద్దే రుణాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

గడువు కోరిన సీబీఐ

ఓబుళాపురం గనుల అక్రమాల కేసుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీబీఐ గడువు కోరింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 29కి వాయిదా వేసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఇన్ని సంక్షేమ పథకాలున్నాయా..?

సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మంత్రి హరీశ్​రావు పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దేశంలో రైతుల క్షేమం గురించి ఆలోచించే ఏకైక సీఎం కేసీఆరే అంటూ కొనియాడారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

బీసీలకే ఇవ్వాలి

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పీఠం బీసీలకు ఇవ్వాలని కోరుతూ.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఎక్కువ జనాభా కలిగిన బీసీలు పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

గరం గరం

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి వైకాపా ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మధ్య సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. పరస్పర అవినీతి ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో ఇరువురు నేతలు గుడిలో సత్య ప్రమాణాలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఆర్మీ చీఫ్ ​సమీక్ష

తూర్పు లద్దాఖ్​లోని కీలక ఫార్వర్డ్​ ప్రాంతాలను సందర్శించారు భారత సైన్యాధినేత జనరల్​ ఎంఎం నరవాణే. సైనిక సన్నద్ధత, తాజా పరిస్థితులపై సమీక్షించారు. జవాన్లతో ముచ్చటించి వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

సంతకాల సేకరణ

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు కోట్ల సంతకాలను డిసెంబరు 24న రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు సమర్పించేందుకు కాంగ్రెస్​ పార్టీ సన్నద్ధమైంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరనుంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

లాభాల జోరు

స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 437 పాయింట్లు బలపడి 46,440పైకి చేరింది. నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 13,600 మార్క్ దాటింది. హెచ్​యూఎల్ అత్యధికంగా 2.50 శాతానికిపైగా లాభాలన్ని గడించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

మెస్సీ.. ఏమన్నాడంటే?

అర్జెంటీనా ఫుట్​బాలర్ మెస్సీ తాజాగా బ్రెజిల్ దిగ్గజం పీలే రికార్డును తిరగరాశాడు. ఈ సందర్భంగా ఇన్​స్టాలో ఓ ఆసక్తికర పోస్టు పెట్టాడీ ఆటగాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

'ఎఫ్​3' షూటింగ్ షురూ

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఎఫ్ 3'. గతేడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం అందుకున్న 'ఎఫ్ ​2'కు ఇది సీక్వెల్. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.