ETV Bharat / state

'తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్లే...'

author img

By

Published : Feb 27, 2020, 7:04 PM IST

Updated : Feb 27, 2020, 8:24 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు.

Kishan Reddy
Kishan Reddy

దేశవ్యాప్తంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచినప్పుడే తెలుగు రాష్ట్రాల్లోనూ సీట్లు పెరుగుతాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి దిల్లీలో స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సీట్ల సంఖ్య పెంచే అవకాశం లేదన్నారు. ఈ అంశంపై న్యాయ శాఖ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. విభజన చట్టంలో ఇష్టం వచ్చినట్లుగా అంశాలను చేర్చారని మంత్రి పేర్కొన్నారు.

జమ్ముకశ్మీర్ అభివృద్ధితోపాటు కేంద్ర సంక్షేమ పథకాల అమలుపై మంత్రి సమీక్షించారు. ప్రజల సహకారంతో అక్కడి పరిస్థితులు అదుపులోకి వచ్చాయని... ఏప్రిల్​, మే నెలల్లో మరోసారి జమ్ముకశ్మీర్​ వెళ్లి అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ కింద బడ్జెట్‌లో రూ.30 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. దిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని... అల్లర్లకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు.

'తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్లే...'

ఇదీ చూడండి : మగాడు గర్భం దాలుస్తాడట.. దేవుడు కొడుకును ప్రసాదిస్తాడట.!

Last Updated : Feb 27, 2020, 8:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.