ETV Bharat / state

corporations chairman's: మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం.. రెండేళ్లపాటు విధులు

author img

By

Published : Dec 16, 2021, 5:00 AM IST

మూడు కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఛైర్మన్లను నియమించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు ఛైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా కార్పొరేషన్ల ఛైర్మన్లుగా ముగ్గురు రెండేళ్ల పాటు బాధ్యతల్లో ఉండనున్నారు.

chairmen for the three corporations
మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మన్నె క్రిశాంక్, వైద్యసేవలు-మౌలికవసతుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా సాయిచంద్‌ను నియమించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ముగ్గురు ఛైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా కార్పొరేషన్ల ఛైర్మన్లుగా ముగ్గురు రెండేళ్ల పాటు బాధ్యతల్లో ఉండనున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.