ETV Bharat / state

ఆక్సిజన్‌ సరఫరాలో రైల్వే శాఖ మరో రికార్డ్​

author img

By

Published : May 24, 2021, 5:26 PM IST

కరోనా రెండో దశ విజృంభిస్తుండటంతో.. ఆక్సిజన్‌ కొరతతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. కొరత తీర్చేందుకు ప్రభుత్వంతో పాటు వివిధ సంస్థలు ముందుకు వచ్చి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నాయి. ఈ సరఫరాలో రైల్వే శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 14 రాష్ట్రాలకు 16,000ల మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది.

oxygen-supply
ఆక్సిజన్‌ సరఫరా

ఆక్సిజన్‌ సరఫరాలో భారతీయ రైల్వే.. మరో కీలక మైలు రాయిని అధిగమించింది. ఇవాళ ఒక్కరోజే అత్యధికంగా 1,142 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌​ను రవాణా చేసినట్లు శాఖ వెల్లడించింది. గత 20వ తేదీన 1, 118 మెట్రిక్ టన్నులు రవాణా చేయగా.. ఇవాళ దాన్ని అధిగమించినట్లు తెలిపింది.

ఈ నెలలో ఇప్పటి వరకు 14 రాష్ట్రాలకు 16,000ల మెట్రికల్ టన్నుల ఆక్సిజన్‌​ను సరఫరా చేసినట్లు రైల్వే వెల్లడించింది. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇంతవరకూ చేరుకున్న రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు.. ఆంధ్ర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అసోం ఉన్నాయి. నెల రోజులుగా శ్రమిస్తూ.. ఆక్సిజన్ సరఫరాలో రైల్వే శాఖ కీలక పాత్ర పోషించింది. ఆక్సిజన్‌ కొరతను తప్పించి.. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతోంది.

ఇదీ చదవండి: '18 ప్లస్​'కు టీకా కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.