ETV Bharat / state

రాష్ట్రంలో రేషన్‌ తీసుకోని వారు అంతమంది ఉన్నారా - మరి వారి పరిస్థితి ఏంటి?

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 13, 2023, 10:09 AM IST

Telangana Ration Cards Issue : పౌరసరఫరాల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 9.88 లక్షల కార్డుదారులు రేషన్‌ తీసుకోవడం లేదని అధికారులకు మంత్రికి వివరించారు. ఈ క్రమంలోనే వీరి కార్డులను కొనసాగించాలా? లేదా? అన్న విషయాన్ని ముఖ్యమంత్రి, కేబినేట్ దృష్టికి తీసుకెళ్లాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకోనున్న మంత్రిమండలి

Ration Card
Ration Card

Telangana Ration Cards Issue : తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల కోసం లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. మరోవైపు 9.88 లక్షల కార్డుదారులు రేషన్‌ తీసుకోవడం లేదని పౌరసరఫరాల సంస్థ గుర్తించింది. కనిష్ఠంగా 11 శాతం మంది రేషన్‌ తీసుకోవట్లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (Minister Uttam Kumar Reddy) నిర్వహించిన సమీక్షా సమావేశంలో వెల్లడైంది. వీరి కార్డులను కొనసాగించాలా? లేదా? అన్న విషయాన్ని సీఎం, కేబినేట్ దృష్టికి తీసుకెళ్లాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో మొత్తం 89.98 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద జారీ చేసిన ఆహార భద్రత కార్డులు 54.39 లక్షలు కాగా, వీటి పరిధిలో 1.94 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి తెలిపింది. రాష్ట్ర సర్కార్ జారీ చేసిన ఆహార భద్రత కార్డులు 35.59 లక్షలని పేర్కొంది. ఇందులో లబ్ధిదారుల సంఖ్య 91.30 లక్షలు. రాష్ట్ర జనాభా 3.95 కోట్లు కాగా వీరిలో 2.85 కోట్ల మంది రేషన్‌ లబ్ధిదారులు ఉన్నట్లు వివరించింది.

How to Apply New Ration Card 2023 in Telangana : మీకు 'రేషన్​కార్డు' లేదా..? మీ మొబైల్​ నుంచే అప్లై చేసుకోండి!

తెలంగాణలోని 71.47 శాతం మంది ప్రజలు ఆహార భద్రత కార్డుల పరిధిలో ఉన్నారని పౌరసరఫరాల శాఖ పేర్కొంది. ఇప్పటికే ఉన్న కార్డుల్లో పిల్లలు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని 11.02 లక్షల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించింది. మరోవైపు ఆరోగ్యశ్రీ, పలు సంక్షేమ పథకాలకు ఆహార భద్రత కార్డు (Telangana Ration Card) ఉండాలన్న నిబంధన కారణంగా ఆర్థికంగా బలంగా ఉన్న చాలామంది ఆహార భద్రత కార్డులు కలిగి ఉన్నారు. వీరే రేషన్‌ తీసుకోవడం లేదని సమీక్షలో తేలింది.

మరోవైపు ప్రతిపాదిత లబ్ధిదారుల సంఖ్య 15.87 లక్షల మంది ఉన్నారని పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి తెలిపింది. వీరి పేర్లను ఆహార భద్రత కార్డుల్లో చేరిస్తే అదనంగా ప్రతి నెలా 9,523.23 టన్నులు, ఏడాదికి 1,14,278.76 టన్నుల బియ్యం కావాలని పేర్కొంది. అదనంగా పడే ఆర్థికభారం ఏడాదికి రూ.445.92 కోట్లు అని ప్రభుత్వానికి వివరించింది.

Ration card Application Status in Telangana : రేషన్ కార్డు జాబితాలో మీ పేరు ఉందా? ఇలా చెక్ చేసుకోండి.. దరఖాస్తు అలా..

Uttam Kumar Reddy review Civil Supplies Department Officials : రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే బియ్యం నాణ్యంగా ఉండాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ధాన్యం సేకరణ, నాణ్యమైన బియ్యం రాబట్టడంపై ఇక నుంచి పౌరసరఫరాల శాఖ దృష్టి సారించాలని సూచించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, గత ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బులు రాకపోవడంతో మొత్తం అప్పులు రూ.56,000ల కోట్లకు పెరిగాయని, ఆ లోటు భర్తీ చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కార్‌ ఉందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు.

How to Apply for One Nation One Ration Card : ఈ కార్డు ద్వారా ఎక్కడి నుంచైనా రేషన్ పొందవచ్చు.. ఇప్పుడే అప్లై చేసుకోండి..!

How Many Types of Ration Cards in India : మీరు ఏ రకమైన రేషన్ కార్డు కలిగి ఉన్నారో.. వాటి లాభాలేంటో తెలుసా..?

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.