ETV Bharat / state

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్​ నియామకాలు జారీ

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 15, 2023, 9:26 PM IST

IAS Officers Postings in Telangana
Telangana Govt Given IAS Officers Postings

Telangana Govt Given IAS Officers Postings : రాష్ట్రంలో ప్రభుత్వమార్పుతో ఐఏఎస్ అధికారుల పోస్టింగులపై విస్తృత చర్చ జరిగింది. ఎవరు ఎక్కడ ఉంటారు, ఎవరికీ ప్రాధాన్య పోస్టులు దక్కుతాయనున్న అంశంపై జోరుగా ఊహాగానాలు వినిపించాయి. పలువురు అధికారులు తమకు వీలున్న మార్గాల ద్వారా కొత్త సీఎం రేవంత్ రెడ్డి, ఆయనకు సంబంధించిన వారిని చేరే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు సంబంధించి పోస్టింగులు ప్రకటన జారీ అయ్యింది.

Telangana Govt Given IAS Officers Postings : రాష్ట్రంలో కొలువుదీరిన కొత్తప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పాటుతో రాష్ట్రస్థాయి పరిపాలన వ్యవస్థలో సమూలంగా మార్పులు వచ్చాయి. ఐఏఎస్ అధికారుల పోస్టింగుల్లో పెద్దఎత్తున బదిలీలు, స్థానచలనం చోటుచేసుకున్నాయి. కొత్త సర్కారు ఏర్పడినప్పుడు వారి ఆలోచనలు, విధానాలకు అనుగుణంగా అధికారుల పోస్టింగులు ఉండటం సహజం. ఈ క్రమంలోనే 2021 బ్యాచ్ తొమ్మిదిమంది ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

  • హన్మకొండ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా రాధికా గుప్తా
  • ములుగు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పి.శ్రీజ
  • నిర్మల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్
  • రాజన్న సిరిసిల్ల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పి.గౌతమి
  • జనగాం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పి.పి.లలిత్ కుమార్
  • మహబూబాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా లెనిన్ వత్సల్
  • మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా శివేంద్ర ప్రతాప్
  • వనపర్తి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా సంచిత్ గాంగ్వార్
  • జయశంకర్ భూపాలపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పి.కదిరవన్

టీఎస్​పీఎస్సీ బోర్డు సభ్యుడు కారం రవీందర్​రెడ్డి రాజీనామా

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ - హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.