ETV Bharat / state

Telangana Assembly Elections 2023 : ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల వ్యయంపై నిఘా!

author img

By

Published : Jul 19, 2023, 9:05 AM IST

EC Focus on Candidates Expenditure Telangana : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం వేగం పెంచింది. ఈ క్రమంలో రానున్న ఎన్నికల దృష్ట్యా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల వ్యయంపై మరింత నిఘా పెట్టేందుకు సాంకేంతికతను జోడించాలని నిర్ణయించింది. అలాగే అభ్యర్థుల ఖర్చుల వివరాలను రహస్య పరిశీలన రిజిస్టర్ పేరుతో ఎన్నికల సంఘం నమోదు చేస్తుంది.

Telangana Assembly Elections 2023
Telangana Assembly Elections 2023

EC Focus on Candidates Expenditure in Telangana Elections : ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల వ్యయంపై మరింత దృష్టి పెట్టేందుకు ప్రత్యేక సాంకేతికతను జోడించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న ఎన్నికల వ్యయంపై నిఘాను మరింత విస్తృతం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అభ్యర్థుల ఖర్చుల వివరాలను రహస్య పరిశీలన రిజిస్టర్‌ (షాడో అబ్జర్వేషన్‌ రిజిస్టర్‌) పేరుతో ఎన్నికల సంఘం నమోదు చేస్తుంది.

Telangana Assembly Elections 2023 : ఇందుకోసం ప్రస్తుతం అభ్యర్థుల ఖర్చుల పర్యవేక్షణ వ్యవస్థ (క్యాండిడేట్‌ ఎక్స్‌పెండిచర్‌ మానిటరింగ్‌ సిస్టం) పేరిట ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఎలక్షన్​ కమిషన్ సిద్ధం చేసింది. త్వరలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, ఛత్తీస్​గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ అభ్యర్థులు చేసే ఖర్చులపై దృష్టి పెట్టేందుకు ఈ సాఫ్ట్‌వేర్‌ వినియోగించాలని ఈసీ నిర్ణయించింది. ఈ సాంకేతికతను మరింత పటిష్ఠం చేసేందుకు గానూ సూచనలను అందించాలని ఈ మేరకు ఆయా రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులను కోరింది. వారు సూచించిన మార్పులతో సాఫ్ట్‌వేర్‌కు తుదిరూపు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

పది విభాగాలుగా వ్యయం : ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలను అభ్యర్థులు నిర్ధారిత వ్యవధుల్లో ఎలక్షన్​ కమిషన్​ అధికారులకు అందజేస్తారు. ఆ పేపర్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో తనిఖీలు చేయటం ప్రహసనమేనని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ఈ క్రమంలో నిఘాను పెంచేందుకు ప్రచార వ్యయాన్ని 10 విభాగాలుగా కేంద్ర ఎన్నికల సంఘం విభజించింది. అలాగే ఆ విభాగాల పరిధిలో 50 అంశాలను పొందుపరిచింది. భారీ సభల నుంచి పత్రికల్లో ఇచ్చే ప్రకటనల వరకు అన్నింటినీ గుర్తించింది.

EC Focus on Assembly Elections : పోటీలో అభ్యర్థులకు టెలివిజన్ ఛానల్స్, సొంత పత్రికలు, సోషల్‌ మీడియా సంస్థలు ఉంటే వాటిల్లో చేసే ప్రచార వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఎన్నికల ప్రచారం కోసం వినియోగించే వ్యక్తులకు చెల్లించే వేతనం, రోజువారీ వ్యయాలను కూడా లెక్కించనుంది. ఎన్నికల సమయంలో పట్టుపడిన నగదు, వివిధ రూపాల్లో పంపిణీ చేసే వస్తువులను, ఆయా అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో నమోదు చేయాలని నిశ్చయించినట్లు తెలుస్తోంది. త్వరలో 5 రాష్ట్రాలకు సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో నూతన సాఫ్ట్‌వేర్‌ను అమలులోకి తేవాలని ఈసీ కసరత్తును ముమ్మరం చేస్తోంది.

దిల్లీ నుంచి పర్యవేక్షణ : కొత్త సాఫ్ట్‌వేర్‌ ద్వారా నమోదు చేసే అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని దిల్లీలోని ప్రధాన కార్యాలయంలోనూ పర్యవేక్షించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేసి రోజువారీ వ్యయాన్ని ఆన్‌లైన్‌ ద్వారా పర్యవేక్షించాలని చూస్తోంది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించటంతో పర్యవేక్షణ మరింత సులువవుతుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.