ETV Bharat / state

Telangana Decade Celebrations : తొమ్మిదేళ్ల ప్రగతి చాటే.. ఉత్సవాలకు వేళాయే

author img

By

Published : May 30, 2023, 8:09 AM IST

Telangana Decade Celebrations : తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు.. సర్కారు సన్నద్ధం అవుతోంది. గ్రామస్థాయి నుంచి పట్టణ, నగరస్థాయి వరకు వైభవంగా చేపట్టేలా అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేస్తోంది. 9 ఏళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజలకు తెలిసేలా ఉత్సవాలుండాలని అధికారులకు ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

Decade Celebrations of Telangana
Decade Celebrations of Telangana

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమావేశం

Telangana Decade Celebrations : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో లోటుపాట్లు లేకుండా చూడటం సహా సమన్వయంతో విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహణపై అన్నిశాఖల కార్యదర్శులు.. ఆ తర్వాత కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. శాఖలవారీగా ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఆరాతీశారు. డాక్యుమెంటరీలు, సంబంధిత పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా చూడాలని.. నిర్ణీత గడువులోగా అన్ని సిద్ధం చేయాలని.. సీఎస్​ స్పష్టం చేశారు. 33 జిల్లాల్లో చేస్తున్న ఏర్పాట్ల గురించి కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. 21 రోజుల పాటు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సూక్ష్మస్థాయిలో సమీక్షించారు. ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. కలెక్టర్లకు శాంతికుమారి స్పష్టం చేశారు.

Telangana Decade Celebrations 2023 : దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని.. ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా భాగస్వాములై పదేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్‌లో దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశంలో యంత్రాంగం, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. 9 ఏళ్లలో తెలంగాణ వివిధ అంశాల్లో దేశానికే ఆదర్శంగా నిలబడి జాతీయ స్థాయిలో సింహభాగాన్ని ఆక్రమించిందన్నారు.

రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించేలా ఆవిర్భావ దశాబ్ది వేడుకలను నిర్వహించాలని.. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్‌ అధికారులకు సూచించారు. మహబూబాబాద్‌లోని కలెక్టరేట్‌లో జూన్ 2 నుంచి 22 వరకు జరిగే వేడుకలపై అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవాలను అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

'రాష్ట్రంలోని పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలి. రైతుబంధు పథకం ద్వారా రైతులకు ఎంత లాభం చేకూరుతుందో చెప్పాలి. ప్రతి సంవత్సరం ఎంత మంది రైతలకు ఈ పథకం ద్వారా నిధులు వస్తున్నాయో వివరించాలి. రాష్ట్ర అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనది' - ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి

Jagadish Reddy on TS Decade Celebrations 2023 : మరోవైపు మూడు వారాల పాటు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు.. బాధ్యతలు తెలిసినవాళ్లు లేరని.. అదే దురదృష్టమని విమర్శించారు. 9ఏళ్లలో బీఆర్​ఎస్ సర్కారు ప్రజలకు ఏం చేసిందో చెప్పేందుకు రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల వేదికగా పూర్తి ప్రణాళికతో ముందుకెళ్తోంది.

మంచిర్యాలలో సీఎం పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్... జిల్లా సమీకృత భవన నిర్మాణాలు పరిశీలించారు. మంచిర్యాల జిల్లా వాసుల చిరకాల కోరికైన మంచిర్యాల జిల్లాను తమ అధినేత కెసిఆర్ నెరవేర్చారని తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయం సహా జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు. మూడువారాలపాటు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని సుమన్ సూచించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.