ETV Bharat / state

Lanco Hills Lands: ల్యాంకో హిల్స్‌ భూములపై సర్కార్​కు అనుకూలంగా తీర్పు

author img

By

Published : Feb 7, 2022, 3:09 PM IST

Updated : Feb 7, 2022, 4:22 PM IST

Lanco Hills Lands: ల్యాంకో హిల్స్‌ నిర్మాణ భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. నిర్మాణాలు జరుగుతున్న 1654.32 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.

Lanco Hills Lands
Lanco Hills Lands

Lanco Hills Lands: మణికొండలోని ల్యాంకోహిల్స్‌ నిర్మాణ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. ల్యాంకోహిల్స్‌లో నిర్మాణాలు జరుగుతున్న 1654.32 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి సుప్రీం తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 2012 ఏప్రిల్‌ 3న వక్ఫ్‌ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఈ మేరకు 156 పేజీల తీర్పును జస్టిస్‌ హేమంత్ గుప్తా బెంచ్‌ వెలువరించింది.

ఈనామ్‌ భూముల చెల్లింపులు పెండింగ్‌ ఉంటే 6 నెలల్లో చెల్లించాలని ఆదేశించింది. భూముల స్వాధీనం విషయంలో వక్ఫ్‌బోర్డు ఇష్టారీతిలో వ్యవహరించడం కుదరదని స్పష్టం చేసింది. వక్ఫ్‌ భూములని భావిస్తే ఆధారాలతో నోటీసులు ఇవ్వాలని, సర్వే నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.భూములు వక్ఫ్‌బోర్డువని తేలితే రూ.50వేల కోట్లు కడతామని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఇదీ చదవండి: cm kcr yadadri visit: 17వసారి యాదాద్రికి సీఎం కేసీఆర్​..

Last Updated : Feb 7, 2022, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.