ETV Bharat / state

కన్నుల పండువగా శ్రీవారి వాహన సేవ.. భక్తులతో కిక్కిరిసిపోయిన గ్యాలరీలు

author img

By

Published : Jan 28, 2023, 6:31 PM IST

Srivari Vahana services start in Tirumala: ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో శ్రీవారి వాహన సేవ కన్నుల పండువగా ప్రారంభమయ్యింది. రథసప్తమిని పురస్కరించుని నేడు స్వామివారు మలయప్ప స్వామి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. సప్తగిరీశుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని.. కర్పూరహారతులతో స్వామి వారికి నీరాజనాలు సమర్పించారు.

Srivari Vahana services start in Tirumala
Srivari Vahana services start in Tirumala

కన్నుల పండువగా శ్రీవారి వాహన సేవ.. భక్తులతో కిక్కిరిసిపోయిన గ్యాలరీలు

Srivari Vahana services start in Tirumala: రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో ఇవాళ శ్రీవారి వాహన సేవలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. సూర్యోదయ వేళ స్వామి వారు.. మలయప్పస్వామి రూపంలో సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ.. భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఐదున్నర గంటలకు వాహన మండపం నుంచి బయలుదేరినా శ్రీవారు వాయువ్య దిశకు చేరుకున్నారు.

అక్కడ భానుని కిరణాలు స్వామి వారి పాదాలకు తాకిన అనంతరం అర్చకులు హారతులు, ప్రత్యేక నైవేద్యాలను సమర్పించి.. వాహన సేవను ప్రారంభించారు. అత్యంత పవిత్రమైన రథసప్తమి రోజున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అనేక ప్రాంతాలు నుంచి గతరాత్రే తిరుమలకు చేరుకున్నారు. దీంతో తిరుమలలోని గ్యాలరీలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలో సూర్యప్రభ వాహనంపై సప్తగిరీశుడిని దర్శించుకున్న భక్తులు..కర్పూరహారతులతో స్వామివారికి నీరాజనాలు సమర్పించారు.

ఇవీ చదవండి

హైదరాబాద్​లో రెండ్రోజుల పాటు 'స్టార్టప్​-20 సదస్సు'

ఘనంగా కుంభాభిషేకం.. హెలికాప్టర్ నుంచి పూల వర్షం.. భారీగా తరలివచ్చిన భక్తులు

ప్రభుత్వంపై స్వామీజీ విమర్శలు.. మైకు లాక్కున్న సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.