ETV Bharat / state

భాగ్యనగరంలో స్వల్ప ఉద్రిక్తత.. పోలీసులతో వాగ్వాదం!

author img

By

Published : May 22, 2021, 12:26 PM IST

Slight tension between police and motorists , lock down in hyderabad
హైదరాబాద్​లో లాక్​డౌన్, భాగ్యనగరంలో లాక్​డౌన్

హైదరాబాద్​లో లాక్​డౌన్ ఆంక్షలను పోలీసులు మరింత కఠినతరం చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఎంజే మార్కెట్​లో రద్దీ నెలకొనడం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో పోలీసులతో కొందరు వాహనదారులు వాగ్వాదానికి దిగారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో భాగ్యనగరంలో లాక్​డౌన్​ను పోలీసులు మరింత కఠినతరం చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్న పోలీసులు... అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిపై చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్​లోని ఎంజే మార్కెట్​లో మినహాయింపు సమయం ముగిసినా రద్దీ తగ్గకపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

అనవసరంగా బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేసి... వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులతో కొందరు వాగ్వాదానికి దిగారు. ఫలితంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఇదీ చదవండి: లాక్​డౌన్ ఆంక్షలు కఠినతరం.. ఉల్లంఘించిన వారిపై ఉక్కుపాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.