రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రంలో అన్నిప్రాంతాల్లో భరోసా కేంద్రాలను ఏర్పాటుచేస్తామని హోంమంత్రి వెల్లడించారు. మహిళల భద్రతకు ఏర్పాటైన షీటీమ్స్ ఐదో వార్షికోత్సవం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి మహమూద్ అలీ, మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. షీటీమ్స్ ఏర్పాటుతో మహిళలపై జరుగుతున్న నేరాలు చాలావరకు తగ్గాయని అభిప్రాయపడ్డారు.
విద్యాశాఖ తరఫున ప్రతి విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేయడానికి పూర్తిగా సహకరిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. కేసీఆర్ దిశానిర్దేశం చేసిన షీటీమ్స్ను పోలీసులు విజయవంతంగా ముందుకు తీసుకువెళుతున్నారని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. దేశంలో తెలంగాణలో మాత్రమే మహిళల భద్రతకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: హుజూర్నగర్ ప్రజలకు రుణపడి ఉంటా: సైదిరెడ్డి