ETV Bharat / state

ఉద్యోగులంతా ఫిట్​నెస్​పై దృష్టి పెట్టాలి: ఎస్బీఐ చీఫ్​ జనరల్​ మేనేజర్​

author img

By

Published : Oct 3, 2021, 6:50 PM IST

fit India freedom run
fit India freedom run

ఉద్యోగులంతా యోగా, కసరత్తులు చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఎస్బీఐ చీఫ్​ జనరల్​ మేనేజర్​ అమిత్​ జింగ్రాన్​ అన్నారు. నెక్లెస్​రోడ్డులోని పీవీ జ్ఞానభూమివద్ద ఆజాదీకా అమృత్​ మహోత్సవ్​లో భాగంగా ఫిట్​ ఇండియా ఫ్రీడం రన్​2ను నిర్వహించారు.

ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో నెక్లెస్​రోడ్​లోని వీపీ జ్ఞానభూమి వద్ద ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​లో భాగంగా ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ 2ను శనివారం నిర్వహించారు. ఈ రన్​లో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. కొవిడ్​ పరిస్థితుల నుంచి కోలుకునేందుకు పలు ఫిట్​నెస్​ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఉద్యోగులంతా యోగా, నడవటం, సైక్లింగ్ లాంటివి చేస్తూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని ఎస్బీఐ చీఫ్​ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ సూచించారు. కసరత్తును రోజు వారీ కార్యక్రమాల్లో భాగం చేసుకోవటం ద్వారా ఫిట్ ఇండియాలో భాగం పంచుకోవాలన్నారు.

హైదరాబాద్​ ఎస్బీఐ ఆధ్వర్యంలో ఫిట్​ ఇండియా ఫ్రీడం రన్​2

ఇదీ చూడండి: బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి సందడి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.