ETV Bharat / state

'గల్లీలో చిందులు... దిల్లీలో విందులు..!'

author img

By

Published : Dec 15, 2020, 8:07 PM IST

sangareddy-mla-jagga-reddy-allegations-on-trs-and-bjp-parties
'గల్లీలో చిందులు వేస్తున్నారు... దిల్లీలో విందులు చేసుకుంటున్నారు'

భాజపా, తెరాస పార్టీలు కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్​ను లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. గల్లీలో చిందులు వేస్తున్నట్లు నటించి... దిల్లీలో విందులు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

భాజపా, తెరాస పార్టీలు దిల్లీలో విందులు చేసుకుని... గల్లీలో చిందులు వేస్తున్నాయని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. ఇరుపార్టీలు రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు. కేసీఆర్ దిల్లీలో ప్రధానిని కలిసి చీకట్టి ఒప్పందం చేసుకున్నారని వ్యాఖ్యానించారు.

ఆ ఒప్పందంలో ఎంఐఎం కూడా ప్రధాన సూత్రధారి అన్నారు. రాజకీయ లబ్ధికోసమే ఆ మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ప్రధానిని కేసీఆర్ కలిసిన వెంటనే... బండి సంజయ్ దిల్లీకి ఎందుకు వెళ్లారని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

'గల్లీలో చిందులు వేస్తున్నారు... దిల్లీలో విందులు చేసుకుంటున్నారు'

ఇదీ చూడండి: 'కాంగ్రెస్‌ కార్యకర్తలను తెరాస నేతలు,పోలీసులు వేధిస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.