ETV Bharat / state

Rythu Bandhu: తొమ్మిదో రోజు రూ.120.16 కోట్లు జమ

author img

By

Published : Jun 24, 2021, 12:11 PM IST

రాష్ట్రంలో రైతు బంధు(Rythu Bandhu) పథకం పెట్టుబడి సాయం కొనసాగుతోంది. ఈ సంవత్సరం వానాకాలం పంటలకు సంబంధించి తొమ్మిదో రోజు... 30 ఎకరాల లోపు ఉన్న 18 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు చేరింది. 2.40 లక్షల ఎకరాలు సంబంధించి 120.16 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 60.75 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం 7,298.83 కోట్ల రూపాయలు జమ చేసింది.

Rythu Bandhu assistance, ninth day in telangana
Rythu Bandhu: తొమ్మిదో రోజు రూ.120.16 కోట్లు జమ

రాష్ట్రంలో రైతు బంధు(Rythu Bandhu) పథకం కింద రైతులకు పెట్టుబడి రాయితీ సాయం పంపిణీ కొనసాగుతోంది. ఈ ఏడాది వానా కాలానికి సంబంధించి గురువారం... తొమ్మిదో రోజు 30 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో సాయం జమ అవుతోంది.

ఇవాళ 18 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 2.40 లక్షల ఎకరాలు సంబంధించి 120.16 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 60.75 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం 7,298.83 కోట్ల రూపాయలు జమ చేసింది.

మొత్తం ఇప్పటి వరకు 145.98 లక్షల ఎకరాలకు రైతు బంధు పథకం సాయం అందినట్లైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మొత్తం ఈ విడతలో ఇప్పటి వరకు 63,25, 695 మంది రైతులకు 7508.78 కోట్ల రూపాయలకుగాను... 60.75 లక్షల మంది రైతులకు 7,298.83 కోట్ల రూపాయలు ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి చెప్పారు.

ఇదీ చూడండి: ఆ ఇంట్లో ప్రతిరోజు 150 కిలోల బియ్యం ఉడకాల్సిందే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.