ETV Bharat / state

'పూర్తి మౌలిక వసతులు కల్పించాకే మార్కెట్​ను తరలించాలి'

author img

By

Published : May 5, 2020, 7:17 PM IST

టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ గాంధీభవన్​లో రైతు సంక్షేమ దీక్ష నిర్వహించారు. మౌలిక వసతులు లేకుండా రాత్రికి రాత్రే కొత్తపేట పండ్ల మార్కెట్​ను తరలించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటని దీక్షలో పాల్గొన్న టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాకే మార్కెట్​ను తరలించాలని డిమాండ్ చేశారు.

కోహెడకు ఎందుకు తరలించారు ?
కోహెడకు ఎందుకు తరలించారు ?

రంగారెడ్డి జిల్లా కోహెడ పండ్ల మార్కెట్​లో పూర్తి స్థాయి మౌలిక వసతులు ఏర్పాటు చేసే వరకు కొత్తపేటలోనే మార్కెట్​ కొనసాగించాలని రేవంత్​రెడ్డి అన్నారు. మౌలిక వసతులు లేకుండా రాచకొండ గుట్టల్లోని కోహెడకు రాత్రికి రాత్రే మార్కెట్​ను ఎందుకు తరలించారని మండిపడ్డారు.

మంత్రుల పరామర్శ ఏదీ ?

రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని రేవంత్ తప్పుబట్టారు. హడావుడిగా.. కొత్తపేట ఫ్రూట్‌ మార్కెట్‌ను కోహెడకు ఎందుకు తరలించారో ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు. తాత్కాలిక షెడ్డు కూలి 26 మందికి తీవ్ర గాయాలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతజరిగినా మంత్రులు పరామర్శించిన దాఖలాలే లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహెడ ఘటనలో గాయపడిన వారిందరికీ రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వమే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

మార్కెట్​పై ప్రభుత్వ పెద్దల కన్ను...

కొత్తపేట ఫ్రూట్‌ మార్కెట్ భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని రేవంత్ ఆరోపించారు. బత్తాయిలను ఇతర రాష్ట్రాలకు అమ్మొద్దని ముఖ్యమంత్రే చెప్పారని... అయినా బత్తాయిని ప్రభుత్వం కొనే యత్నమే చేయలేదన్నారు. బత్తాయి రైతులు తిరగబడితే ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోవచ్చని చెప్పిందన్నారు. ఈ క్రమంలోనే బత్తాయి మురిగిపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే వరి ఎక్కువగా పండిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల కష్టాన్ని కూడా ప్రభుత్వం తమ ఖాతాల్లో వేసుకోవడాన్ని రేవంత్ తప్పుబట్టారు.

ఇవీ చూడండి : క్షౌరశాలలు లేకుంటేనేం.. మీకు నేనున్నానంటున్న మహిళ.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.