ETV Bharat / state

ఉమ్మడి నియామక బోర్డు ద్వారా నియామకాల్లో పారదర్శకత ఉండాలి: గవర్నర్

author img

By

Published : Nov 10, 2022, 3:21 PM IST

Updated : Nov 10, 2022, 9:01 PM IST

Raj Bhavan appointment for Minister Sabita and education officials
Raj Bhavan appointment for Minister Sabita and education officials

15:17 November 10

వర్సిటీల బిల్లుపై గవర్నర్​ సందేహాలను నివృత్తి చేసిన సబిత

  • Delegation led by Honb Edu Minister of Telangana Smt @SabithaindraTRS alongwith
    Smt.Vakati Karuna IAS Sec - Edu, Sri Naveen Mittal IAS Commissioner Collegiate Education & Tech Edu & Prof R.Limbadri-Chairman of TS State Council of Higher Edu called on at Raj Bhavan #Hyderabad. pic.twitter.com/tzyiHghfym

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) November 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుకు సంబంధించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సందేహాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు నివృత్తి చేశారు. తన కార్యాలయంలో మొదట అధికారులతో సమావేశమైన మంత్రి సబిత.. సాయంత్రం ఐదు గంటలకు రాజ్​భవన్ చేరుకున్నారు. మంత్రితో పాటు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిత్తల్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఉన్నారు. ఉమ్మడి నియామక బోర్డుకు సంబంధించి తనకు ఉన్న సందేహాలను గవర్నర్ వారి ముందు ఉంచారు. యూజీసీ విధివిధానాలకు లోబడే జరుగుతాయా, న్యాయ పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం.. రిజర్వేషన్లు తదితర అంశాలను తమిళిసై ప్రస్తావించారు. యూజీసీ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటిస్తున్నామని, న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు.. గవర్నర్​కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు వివరించారు. ప్రస్తుత నియామక విధానంలోని ఇబ్బందులు కొత్త విధానం ద్వారా వచ్చే సౌలభ్యాన్ని వారు గవర్నర్​కు చెప్పారు.

ఈ సందర్భంగా ఉమ్మడి నియామక బోర్డు ద్వారా నియామకాల్లో పారదర్శకత ఉండాలని గవర్నర్‌ పేర్కొన్నారు. పక్షపాతం లేకుండా అర్హతల ప్రకారం త్వరగా జరగాలని సూచించారు. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా నియామకాలు జరగాలన్న తమిళిసై.. రాష్ట్ర యువత ఆశలకు అనుగుణంగా నియామకాలు జరగాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని.. వసతి గృహాలు, ల్యాబ్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. లైబ్రరీ సౌకర్యాలు, డిజిటల్ వసతి మెరుగుదలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. వర్సిటీల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం పెంచాలని చెప్పారు.

అసలేం జరిగిదంటే: నిన్న ప్రెస్‌మీట్‌ నిర్వహించిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రభుత్వం వద్ద నుంచి తన వద్దకు బిల్లులు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వ బిల్లుల విషయమై పరిశీలిస్తున్నామని చెప్పారు. వర్సిటీలో ఉమ్మడి నియామక బోర్డుపై ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. బిల్లుపై సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. మరికొన్ని బిల్లులపై సందేహాలు నివృత్తి చేసుకోవాల్సి ఉందన్నారు. అన్ని బిల్లులపై సమగ్రంగా పరిశీలన కోసం సమయం తీసుకున్నానని తెలియజేశారు. ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయాలని చెప్పానని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల వీసీలతోనూ మాట్లాడానని అన్నారు. అన్ని అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించానని చెప్పిన విషయం తెలిసిందే.

ఇవీ చూడండి..

గవర్నర్ సమయమిస్తే... అన్నీ వివరిస్తాం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

నేను ఎలాంటి బిల్లులను ఆపలేదు: గవర్నర్‌ తమిళిసై

దేవుడి దర్శనం కోసం 2 కిలోమీటర్లు నడిచిన రాష్ట్రపతి

Last Updated :Nov 10, 2022, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.