ETV Bharat / state

రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు

author img

By

Published : Sep 22, 2020, 5:03 PM IST

రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు
రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు

రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ గ్రామీణ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఉత్తర ఛత్తీస్​గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని.. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఇది ఎత్తుకి వెళ్లే కొద్ది నైరుతి దిశవైపునకు వంపు తిరిగి ఉందని తెలిపింది.

రాగల రెండు రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వెల్లడించింది. తదుపరి ఈశాన్య దిశగా ఉత్తరప్రదేశ్‌ వైపుగా ప్రయాణించే అవకాశం ఉందని చెప్పింది. బుధ, గురువారాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

ఇదీ చూడండి: ధరణి పోర్టల్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.