ETV Bharat / state

ఏపీ సీఎం జగన్ ఆస్తుల కేసుపై సీబీఐ కోర్టులో విచారణ వాయిదా

author img

By

Published : May 12, 2021, 8:06 PM IST

ఏపీ సీఎం జగన్ ఆస్తుల కేసుపై.. హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఇందూ టెక్ జోన్ కేసులో జగన్‌పై నమోదైన అభియోగాలపై విచారణను న్యాయస్థానం ఈ నెల 20కి వాయిదా వేసింది.

జగన్​ సీబీఐ కేసు వాయిదా
ఏపీ వార్తలు

జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇందూ టెక్ జోన్ ఛార్జ్ షీట్​పై కూడా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. జగన్​పై అభియోగాల నమోదు కోసం విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. పెన్నా ఛార్జ్ షీట్​లో ప్రతాప్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్, అభియోగాల నమోదుపై ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు జరిగాయి. మరిన్ని వాదనల కోసం విచారణను న్యాయస్థానం ఈనెల 20కి వాయిదా వేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్​కు సంబంధించిన ఛార్జ్ షీట్​పై విచారణ ఈనెల 24కి వాయిదా పడింది.

ఇదీ చూడండి: మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.