ETV Bharat / state

Nandamuri Ramakrishna: 'ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసమంటే.. తెలుగుజాతిని అవమానించినట్లే..'

author img

By

Published : Jan 3, 2022, 11:37 AM IST

Updated : Jan 3, 2022, 1:26 PM IST

Nandamuri Ramakrishna
నందమూరి రామకృష్ణ

Nandamuri Ramakrishna: ఏపీలోని గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం తెలుగుజాతిని అవమానించినట్లేనని నందమూరి రామకృష్ణ అన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు.

Nandamuri Ramakrishna: ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై నందమూరి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేస్తే తెలుగుజాతిని అవమానించినట్లేనని పేర్కొన్నారు.

ఎన్టీఆర్​ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు. ఎన్టీఆర్ విగ్రహంపై చేయి వేస్తే తెలుగుజాతి ఊరుకోదని హెచ్చరించారు. ఎన్టీఆర్ అభిమానులమని చెప్పే కొందరు వైకాపా నాయకులు నిద్రపోతున్నారా? అని నందమూరి రామకృష్ణ నిలదీశారు.

ఇదీ జరిగింది..

ఏపీలోని గుంటూరు జిల్లా దుర్గిలో ఓ వ్యక్తి.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించాడు. దుర్గి మార్కెట్‌యార్డ్ మాజీ ఛైర్మన్ యలమంద కుమారుడు కోటేశ్వరరావు.. గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని సుత్తితో పగల గొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో విగ్రహం స్వల్పంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న దుర్గి ఎస్సై పాల్.. కేసు నమోదు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

ఇదీ చదవండి: NTR STATUE IN DURGI : అందరూ చూస్తుండగా.. ఎన్టీఆర్ విగ్రహంపై దాడి!

Last Updated :Jan 3, 2022, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.