ETV Bharat / state

'కమీషన్ల కోసం 4 జిల్లాలను ఎండబెడుతున్నారు'

author img

By

Published : May 19, 2020, 5:46 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ తీరుపై కాంగ్రెస్​ నాయకులు గాంధీభవన్​లో మండిపడ్డారు. పోతిరెడ్డిపాడుతో తెలంగాణలోని 4 జిల్లాలు ఎడారవుతాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పేర్కొన్నారు. కమీషన్ల కోసమే ఇలా చేస్తున్నట్లు ఆరోపించారు.

MP KOMATIREDDY VENKAT REDDY CRITICISED CM KCR AT GANDHI BHAVAN
'కమీషన్ల కోసం 4 జిల్లాలను ఎండబెడుతున్నారు'

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు 90 శాతం మేర పూర్తయ్యాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి పనులు 9 శాతం కూడా పూర్తికాలేదని వెల్లడించారు. కమీషన్ల కోసం నాలుగు జిల్లాలను ఎండబెడుతున్నారని ఆరోపించారు. నల్గొండ జిల్లాలో నీళ్లు రావాలంటే వెయ్యి ఫీట్లు వేయాలని చెప్పారు. జిల్లాకు ప్రాజెక్టు వచ్చి ఉంటే చెరువులు నిండి భూగర్భ జలాలు పెరిగేవని స్పష్టం చేశారు.

'కమీషన్ల కోసం 4 జిల్లాలను ఎండబెడుతున్నారు'

ఇదీ చూడండి: 'ప్రభుత్వ చర్యతో తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.