MLC KAVITHA in Mandali: 'ఎంపీటీసీలకు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు'

author img

By

Published : Sep 27, 2021, 9:23 PM IST

MLC KAVITHA

ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు పాఠశాలల్లో జాతీయ జండా ఎగురవేసే అధికారం కల్పించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. వారికి తగిన ప్రాముఖ్యత కల్పించడానికి అవసరమయితే చట్టసవరణ చేయాలని శాసన మండలిలో విజ్ఞప్తి చేశారు. మినీ అంగన్ వాడిలకు అంగన్ వాడి టీచర్లకు ఇచ్చినట్లు వేతనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎంపీపీలకు కార్యాలయాలు లేవని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసన మండలిలో అన్నారు. ఎంపీటీసీలకు గ్రామ పంచాయతీల్లో కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవని పేర్కొన్నారు. ఎంపీటీసీలకు తగిన ప్రాముఖ్యత కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

స్థానిక సంస్థలకు15వ ఆర్థిక సంఘం రూ.500 కోట్లు లోటు పెట్టినా...స్థానిక ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ. 500 కోట్లు అదనంగా ఇచ్చారని ఆమె వివరించారు. అయినా క్షేత్ర స్థాయిలో ఉన్న లోటుపాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నట్లు మండలిలో పేర్కొన్నారు. ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు పాఠశాలల్లో జాతీయ జండా ఎగురవేసే అధికారం కల్పించాలని కవిత కోరారు. అవసరమయితే వారికోసం చట్టసవరణ చేయాలని శాసన మండలిలో విజ్ఞప్తి చేశారు.

కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎంపీపీలకు కార్యాలయాలు లేకపోవడమన్నదీ తీరని లోటుగా ఉంటాఉన్నది. అధేవిధంగా ఎంపీటీసీలకు ప్రత్యేకమైన స్థానం లేదు. అంటే వారు గ్రామ పంచాయతీల్లో కూర్చోవడానికి కుర్చీలు కూడాలేవు. దీంతో వారికి సరైన గౌరవం లేదని వాపోతుండడంతో వారికి తగిన ప్రాముఖ్యత కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు పాఠశాలల్లో జాతీయ జండా ఎగురవేసే అధికారం కల్పించాలని కోరుతున్నాను. -కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ

శాసన మండలిలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఇదీ చదవండి:owaisi request to kcr: దళితబంధు తరహాలోనే ముస్లింలను ఆదుకోండి.. సీఎంకు ఓవైసీ విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.