ETV Bharat / state

బుల్లెట్టు బండెక్కి అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్

author img

By

Published : Feb 11, 2023, 2:00 PM IST

MLA Rajasingh
ఎమ్మెల్యే రాజాసింగ్

Rajasingh came to the Assembly on a bike: అసెంబ్లీ సమావేశాలకు ఓ ఎమ్మెల్యే బైక్​ మీద వచ్చి షాక్ ఇచ్చారు. బుల్లెట్టు బండెక్కి రయ్ రయ్ మంటూ అసెంబ్లీకి వచ్చారు ఎమ్మెల్యే రాజాసింగ్. అదేంటో ఓసారి చూద్దాం.

Rajasingh came to the Assembly on a bike: శాసన సభ సమావేశాల్లో పాల్గొనేందుకు గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ద్విచక్ర వాహనంపై అసెంబ్లీకి వచ్చారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పదే పదే మోరాయించడంతో అసహనం వ్యక్తం చేశారు. ఆ వాహనాన్ని పోలీసులకు ఆయన అప్పగించారు. దీంతో అసెంబ్లీకి బుల్లెట్టు బండిపై వచ్చారు.

శుక్రవారం ఇలానే మొరాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్​కు ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్​ ప్రూఫ్ వాహనం ఎప్పటికప్పుడు మొరాయించడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. వాహనం ఎక్కడబడితే అక్కడే ఆగిపోతోందని రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కి ఇచ్చేందుకు ప్రగతిభవన్ వద్దకు వెళ్లిన రాజాసింగ్​ను పంజాగుట్ట పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ నడుస్తున్న సమయంలో ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతో ఆయనను పోలీసులు అసెంబ్లీకి తరలించారు. ఆ తరువాత ప్రధాన గేట్ వద్ద నుంచి రాజాసింగ్​ నడుచుకుంటూ అసెంబ్లీలోకి వెళ్లారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.