ETV Bharat / state

ప్రధాని మోదీకి కేటీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందే: రఘునందన్​ రావు

author img

By

Published : Mar 28, 2023, 4:56 PM IST

RaghunandanRao Fires on Minister KTR
RaghunandanRao Fires on Minister KTR

RaghunandanRao Fires on Minister KTR: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావుపై తనశైలిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్​ రావు మాట్లాడారు. మంత్రి కేటీఆర్.. ప్రధానిపై చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు. ప్రధాని కుర్చీకి కూడా వారు గౌరవం ఇవ్వడం లేదన్నారు. ఆ వేములవాడ రాజన్న వారికి సరైన సమయంలో బుద్ది చెబుతారని తెలిపారు.

RaghunandanRao Fires on Minister KTR: ప్రధానిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికావని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ప్రధాని కుర్చీకి కూడా గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు. పరువు నష్టం దావాలను తప్పించుకోవడానికి కొత్త పద్ధతి నేర్చుకున్నారని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఎమ్మెల్యే రఘునందన్​ రావు... మంత్రి కేటీఆర్​పై తనదైన శైలిలో విమర్శలు చేశారు.

కేటీఆర్ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు: రఘునందన్​రావు

MLA RaghunandanRao interesting comments: ఆ వేములవాడ రాజన్న వారికి సరైన సమయంలో కేటీఆర్​కు బుద్ది చెబుతారని పేర్కొన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టామని చెబితే బాగుండేదని విమర్శించారు. నరేంద్ర మోదీ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడరని మండిపడ్డారు. సరైనా ఆధారాలు లేకుండా మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

MLA RaghunandanRao Allegations on ktr ప్రభుత్వ భూమి అని కోర్టు ఆర్డర్ ఇచ్చాక హాఫిజ్ పేటలోని సర్వే నంబర్ 77లో 8 ఎకరాలు భూమిలో మున్సిపల్ మంత్రిగా అనుమతి ఇచ్చిన మాట వాస్తవమా? కాదా అని ప్రశ్నించారు. వారికి అనుకూలంగా ఉన్న వాళ్లకు అక్రమ భవనాలకు అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. డబ్బులు తీసుకుని అక్రమ భవనాలను క్రమబద్ధీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వివాదాల్లో ఉన్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు.

మంత్రి కేటీఆర్.. తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ''ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చెప్పినట్లుగా... ప్రధాని మోదీ మీద ఏదైనా మాట్లాడితే లోపల వేయాలని అన్నారు. అదే నిజం అయితే ఇప్పుడు లోపల వేయాల్సింది మంత్రి కేటీఆర్​నే'' అని గుర్తు చేశారు. ప్రధాని మోదీపై మాట్లాడిన మాటలు పొరపాటు జరిగిందని చెబుతారని ఆశిస్తున్నామని ఆయన వివరించారు.

ఈ దేశ ప్రధాన మంత్రిని ఎవరు కించపరిచినా.. సీఎం కేసీఆర్ ప్రెస్​మీట్ పెట్టి ఒక మాట చెప్పారు. ప్రధాన మంత్రి మీద ఏవరైనా మట్లాడితే వారిని తీసుకొచ్చి లోపల వెయ్యమన్నారు. సీఎం కేసీఆర్ మాట శాశనం అయితే ముందుగా లోపల వేయ్యాల్సింది కేటీఆర్​నే. ఎందుకంటే సిరిసిల్లలో నిన్న వారు మాట్లాడిన మాటలు.. ప్రధాన మంత్రి అనే వారి స్థాయిని గుర్తించకుండా మాట్లాడారు. నిన్న మీరు సిరిసిల్లలో మాట్లాడిన పదాలన్నిటినీ విత్​డ్రా చేసుకుని భవిష్యత్తులో ఇలాంటి పదాలు రాకుండా చూసుకోవాలని కోరుతున్నా. ఆయనకు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నా... -రఘునందన్​రావు, దుబ్బాక ఎమ్మెల్యే

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.