ETV Bharat / state

మంచి కలలు ఆశ్రమంలో బాలుడు మిస్సింగ్​

author img

By

Published : Sep 17, 2019, 11:31 AM IST

మంచి కలలు అనే స్వచ్ఛంద సంస్థలో ఆశ్రయం పొందుతున్న ఓ బాలుడు కనిపించకుండా పోయిన ఘటన మారేడ్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

మంచి కలలులోని బాలుడు మిస్సింగ్​

మారేడ్​పల్లిలోని మంచి కలలు అనే స్వచ్ఛంద సంస్థలో ఆశ్రయం పొందుతున్న అనిల్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. కనిపించకుండా పోయిన ఈ బాలుడు ఆర్ఎం స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. గతేడాది వేసవి కాలంలోనూ తరగతుల దృష్ట్యా అనిల్​ వెళ్లిపోగా అతన్ని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లో తిరుపతి ట్రైన్ ఎక్కుతుండగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రైల్వేస్టేషన్, బస్టాండ్​, ట్యాంక్​బండ్ తదితర పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికీ అనిల్​జాడ తెలియలేదని సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. వెంటనే మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్టు చెప్పారు.

మంచి కలలు ఆశ్రమంలో బాలుడు మిస్సింగ్​

ఇదీ చూడండి: తెలంగాణ విమోచన దినోత్సవం వెనకున్న చరిత్ర ఇదే!!

Intro:సికింద్రాబాద్ యాంకర్..స్వచ్ఛంద సంస్థలు ఆశ్రయం పొందుతున్న బాలుడు కనిపించకుండా పోయిన ఘటన మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది..మారేడుపల్లి లోని మంచి కలలు అనే సంస్థ లో అనిల్ అనే బాలుడు ఆశ్రయం పొందుతున్నాడు..ఆర్ ఎం స్కూల్లో అనిల్ నాలుగవ తరగతి చదువుతున్న టు పోలీసులు వెల్లడించారు..గత సంవత్సరం కూడా వేసవి కాలంలో తరగతుల దృష్ట్యా ఇతను వెళ్లిపోగా అతన్ని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తిరుపతి ట్రైన్ ఎక్కుతుండగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు..తమకు తెలిసిన వ్యక్తుల వద్ద రైల్వే స్టేషన్ బస్టాండ్ లో ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయిందని సంస్థ వారు తెలిపారు..వెంటనే మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.. Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.