ETV Bharat / state

ఆ విద్యార్థులకు మంత్రులు కేటీఆర్‌, సబిత ప్రశంసలు

author img

By

Published : Jan 4, 2021, 4:08 PM IST

Ministers KTR and Sabitha Indra Reddy praised the School students at MCRHRD
ఆ విద్యార్థులకు మంత్రులు కేటీఆర్‌, సబితాఇంద్రారెడ్డి ప్రశంసలు

ఎంసీహెచ్‌ఆర్డీలో పాఠశాల విద్యార్థులు ఆవిష్కరణల ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు టీఎస్‌ఐసీ ఈ కార్యక్రమం చేపట్టింది. ప్రదర్శనను వీక్షించిన మంత్రులు సబితాఇంద్రారెడ్డి, కేటీఆర్... విద్యార్థులను‌ ప్రశంసించారు.

ఆ విద్యార్థులకు మంత్రులు కేటీఆర్‌, సబితాఇంద్రారెడ్డి ప్రశంసలు

ఎంసీహెచ్‌ఆర్డీలో పాఠశాల విద్యార్థుల ఆవిష్కరణల ప్రదర్శనను మంత్రులు కేటీఆర్​, సబితా ఇంద్రారెడ్డి వీక్షించారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు టీఎస్​ఐసీ రూపొందించిన కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు.

33 జిల్లాల నుంచి 7వేల93 ప్రతిపాదనలు రాగా.. 25 పాఠశాలల విద్యార్థి బృందాల ఆవిష్కరణలను ఎంపిక చేశారు. విద్యార్థులతో ముచ్చటించిన కేటీఆర్ పలు ఆవిష్కరణల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మిషన్‌ భగీరథ నీటి వృధా కాకండా ఓ పాఠశాల విద్యార్థుల ప్రయోగాన్ని ప్రశంసించారు.

ఇదీ చూడండి: కేసులు తక్కువే అయినా.. వేటికవే ప్రత్యేకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.