MINISTER TALASANI SRINIVAS YADAV: హైదరాబాద్ సనత్నగర్లోని దాసారం బస్తీలో నివసిస్తున్న ప్రజలందరికీ మౌలిక సదుపాయాల కోసం కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. స్థానిక గుడిసెవాసుల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. దాసారం బస్తీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ప్రస్తుతం ఉన్న చెత్త డంప్ను తొలగించి కొత్తగా నిర్మాణాలు చేపట్టనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. బస్తీ వాసులు పరిశుభ్రతను పాటిస్తూ పక్క కాలనీవాసులతో కలిసి మెలిసి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లక్ష్మీ బాల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు బాల్ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Lyricist Kandikonda : కందికొండ కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రి తలసాని