ETV Bharat / state

దాసారం బస్తీ అభివృద్ధికి కృషి: మంత్రి తలసాని

author img

By

Published : Mar 13, 2022, 4:51 PM IST

Minister speaking at the event
కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి

MINISTER TALASANI SRINIVAS YADAV: సనత్​నగర్​లోని దాసారం బస్తీవాసులకి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అర్హులైన వారందరికి డబుల్ బెడ్​రూం ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. బస్తీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

MINISTER TALASANI SRINIVAS YADAV: హైదరాబాద్ సనత్‌నగర్‌లోని దాసారం బస్తీలో నివసిస్తున్న ప్రజలందరికీ మౌలిక సదుపాయాల కోసం కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. అర్హులైన వారికి డబుల్ బెడ్​రూం ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. స్థానిక గుడిసెవాసుల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. దాసారం బస్తీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

ప్రస్తుతం ఉన్న చెత్త డంప్‌ను తొలగించి కొత్తగా నిర్మాణాలు చేపట్టనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. బస్తీ వాసులు పరిశుభ్రతను పాటిస్తూ పక్క కాలనీవాసులతో కలిసి మెలిసి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లక్ష్మీ బాల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు బాల్‌ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Lyricist Kandikonda : కందికొండ కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రి తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.