ETV Bharat / city

Lyricist Kandikonda : కందికొండ కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రి తలసాని

author img

By

Published : Mar 13, 2022, 12:39 PM IST

Updated : Mar 13, 2022, 2:00 PM IST

Lyricist Kandikonda : ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ యాదగిరి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ వెల్లడించారు. హైదరాబాద్ ఫిల్మ్‌ఛాంబర్‌లో గేయ రచయిత కందికొండ యాదగిరి భౌతికకాయానికి ఆయన నివాళి అర్పించారు.

Talasani srinivas yadav Condolence Kandikonda
Talasani srinivas yadav

Lyricist Kandikonda : హైదరాబాద్ ఫిల్మ్‌ఛాంబర్‌లో గేయ రచయిత కందికొండ యాదగిరి భౌతికకాయానికి రాజకీయ, సినీ ప్రమఖులు, అభిమానులు నివాళి అర్పించారు. అనారోగ్యంతో బాధపడుతూ కందికొండ యాదగిరి నిన్న తుదిశ్వాస విడిచారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, తెరాస ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, రచయిత పరుచూరి గోపాలకృష్ణ... కందికొండ పార్థీవదేహానికి నివాళి అర్పించారు. కందికొండ మరణం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హామీ ఇచ్చారు.

Lyricist Kandikonda : కందికొండ కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రి తలసాని

నాగుర్లపల్లిలో అంత్యక్రియలు..

వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో కందికొండ స్వగ్రామం నాగుర్లపల్లిలో రేపు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కందికొండ కుటుంబానికి చిత్రపురి కాలనీలో రెండు పడక గదుల ఇల్లును ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కందికొండ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు.

హైదరాబాద్​ వెంగళరావునగర్‌లోని తన ఇంట్లో ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ యాదగిరి (49) శనివారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లు వెద్యులు తెలిపారు. కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఆ వ్యాధిని జయించినా, ఆ వ్యాధి ప్రభావం వెన్నెముకపై పడటంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, స్నేహితుల సహకారంతో ఇటీవల వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నా, పూర్తి స్థాయిలో కోలుకోలేదు.

‘మళ్లీకూయవే గువ్వ’ పాటతో..

హృదయాలను హత్తుకునేలా ఎన్నో పాటలు రాసిన కందికొండ.. చక్రి సంగీత దర్శకత్వంలో ఎక్కువ పాటలు రాశారు. ఆయన పూర్తి పేరు కందికొండ యాదగిరి. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో కందికొండ జన్మించారు. ఓయూలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ చదివారు. తెలుగు సాహిత్యం, రచనలపై తనకున్న ఆసక్తి కారణంగా క్రమంగా సినీ రంగంవైపు అడుగులు చేశారు. ఇంటర్‌ చదువుతున్న సమయంలోనే సంగీత దర్శకుడు చక్రితో స్నేహం ఏర్పడింది. 2001లో పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంలో ‘మళ్లీకూయవే గువ్వ’ పాటతో ఆయన గేయ రచయితగా మారారు. మంచి మెలోడీ గీతంగా ఆ పాట శ్రోతలను విశేషంగా అలరించింది. దీంతో చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలు తలుపుతట్టాయి. అలా ‘ఇడియట్‌’లో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’, ‘సత్యం’లో ‘మధురమే మధురమే’, ‘ఐయామ్‌ ఇన్‌ లవ్‌’, ‘పోకిరి’లో ‘గల గల పారుతున్న గోదారిలా’ ‘జగడమే’, ‘లవ్‌లీ’లో ‘లవ్‌లీ లవ్‌లీ’ తదితర పాటలు రాశారు. చివరిగా 2018లో ‘నీది నాది ఒకే కథ’లో రెండు పాటలు రాశారు.

పల్లెపల్లెనా, గడప గడపనా..

సినిమా పాటలే కాకుండా బతుకమ్మ నేపథ్యంలో రాసి పాటలు పల్లెపల్లెనా, గడపగడపనా జనం నోట మార్మోగాయి. పాటలే కాదు, కవిత్వం రాయడంలోనూ కందికొండ దిట్ట. తెలంగాణ యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయడం ఆయన ప్రత్యేకత. మట్టి మనుషుల వెతలు, పల్లెబతుకు చిత్రాలను కథలుగా రచించి కథకుడిగానూ విశేష ఆదరణ పొందారు.

ఇదీచూడండి: Tollywood Lyricist Kandikonda: కందికొండ మృతి పట్ల సీఎం కేసీఆర్​ తీవ్ర దిగ్భ్రాంతి..

Last Updated :Mar 13, 2022, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.