ETV Bharat / state

ఇళ్ల లిస్ట్​ ఇస్తాం... మీరే తిరిగి చూసుకోండి : తలసాని

author img

By

Published : Sep 18, 2020, 3:42 PM IST

హైదరాబాద్​ శివార్లలో ఇళ్లు కట్టినా.. అవి నగరవాసులకే అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 10 శాతం ఇళ్లు స్థానికులకు, 90 శాతం ఇళ్లు హైదరాబాద్​ ప్రజలకే ఇస్తామని స్పష్టం చేశారు. లక్ష ఇళ్లకు సంబంధించి జాబితా కాంగ్రెస్​ నేతలకు ఇస్తామని.. దాని ప్రకారం వాళ్లే తిరిగి చూసుకోవచ్చన్నారు.

talasani srinivas yadav
talasani srinivas yadav

హైదరాబాద్​ నగరంలో స్థలాలు లేకపోవడం వల్లే శివార్లలో నిర్మిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇక్కడ కట్టే ఇళ్లల్లో 90 శాతం జీహెచ్ఎంసీ పరిధి ప్రజలకే ఇస్తామని స్పష్టం చేశారు. లక్ష ఇళ్లకు సంబంధించిన లిస్ట్ ఇస్తామంటే కాంగ్రెస్ వాళ్లు పారిపోతున్నారని విమర్శించారు.

హైదరాబాద్​లో భట్టి స్థలాలు చూపిస్తే అక్కడ ఇళ్లు కట్టించే బాధ్యత తమ ప్రభుత్వానిదని మంత్రి తెలిపారు. గాంధీ భవన్​కు వెళ్లి ఇష్టమున్నట్లు మాట్లాడుకోవచ్చని సూచించారు. లక్ష ఇళ్లకు సంబంధించి జాబితా ఇస్తామని.. దాని ప్రకారం వాళ్లే తిరిగి చూసుకోవచ్చన్నారు.

ఇళ్ల లిస్ట్​ ఇస్తాం... మీరే తిరిగి చూసుకోండి : తలసాని

ఇదీ చదవండి : ఇళ్ల సందర్శనను అర్ధాంతరంగా నిలిపివేసిన కాంగ్రెస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.