ETV Bharat / state

'ఆర్థిక పురోగతిలో పర్యటక శాఖది కీలకపాత్ర'

author img

By

Published : Feb 9, 2020, 12:39 PM IST

హైదరాబాద్​ నగరాన్ని ఐదేళ్లలో 5 లక్షల మంది విదేశీ పర్యటకులు సందర్శించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ బిర్యానీకి ఇటీవలే యునెస్కో నుంచి మంచి గుర్తింపు లభించిందన్నారు.

minister srinivas goud
'ఐదేళ్లలో హైదరాబాద్​ని 5 లక్షల మంది సందర్శించారు'

రాష్ట్రంలో ఆర్థిక శాఖ పురోగతిలో పర్యటక శాఖ కీలక పాత్ర పోషిస్తుందని పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్​మెంట్​లో టూరిజం అండ్ హాస్పటలిటీ స్టెనబుల్ డెవలప్​మెంట్ గోల్స్ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యాక్రమనికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి... ఇటీవలే హైదరాబాద్​ బిర్యానీకి యునెస్కో నుంచి మంచి గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు.

'ఐదేళ్లలో హైదరాబాద్​ని 5 లక్షల మంది సందర్శించారు'

ఇవీ చూడండి: ముగిసిన సమ్మక్క-సారలమ్మ జాతర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.