ETV Bharat / state

బీజేపీలో మున్నాభాయ్​ MBBS తరహాలో చాలా మంది ఉన్నట్లున్నారు: కేటీఆర్​ ట్వీట్

author img

By

Published : Apr 4, 2023, 1:43 PM IST

Updated : Apr 4, 2023, 2:02 PM IST

Minister KTR
Minister KTR

KTRs tweet on BJP MPs have fake certificates: భారతీయ జనతా పార్టీలో మున్నాభాయ్​ ఎంబీబీఎస్​ తరహాలో చాలా మంది ఉన్నట్లున్నారని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ ఆరోపించారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలపై నకిలీ ధ్రువపత్రాల ఆరోపణలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్​ ట్వీట్​ చేశారు.

KTRs tweet on BJP MPs have fake certificates: సామాజిక మాద్యమాల్లో ఎప్పుడు క్రియాశీలకంగా ఉండే మంత్రి కేటీఆర్​ ఈసారి మరో ట్వీట్​తో నకిలీ ధ్రువపత్రాలపై చర్చకు తెరలేపారు. భారతీయ జనతా పార్టీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ తరహా చాలా మంది ఉన్నట్లున్నారని కేటీఆర్​ ట్విటర్​ వేదికగా ఆరోపించారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలపై నకిలీ ధ్రువపత్రాల ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. వారి ఇరువురి దగ్గర రాజస్థాన్, తమిళనాడు విశ్వవిద్యాలయాల నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని అంటున్నారని చెప్పారు. ఎంపీగా ఎన్నికైన అఫిడవిట్​లో అబద్ధాలు చెప్పడం నేరం కాదా అని ప్రశ్నించారు. లోక్​సభ సభాపతి వాటిని పరిశీలించి తప్పు అని తేలితే అనర్హత వేటు వేస్తారా..! అని కేటీఆర్ ట్విటర్ వేదికగా నిలదీశారు.

  • Looks like we have too many MunnaBhai, MBBS types in BJP

    2 BJP MPs from Telangana are also allegedly Fake Certificate holders 😄 Have forged certificates from Rajasthan & TN Universities

    Isn’t it a criminal offence to lie in your election affidavit on whose basis MP gets…

    — KTR (@KTRBRS) April 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్​ వివాదం: ప్రస్తుతం దేశవ్యాప్తంగా నకిలీ ధ్రువపత్రాలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు చూపించాలని కోరిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​కు గుజరాత్ హైకోర్టు మార్చి 31వ తేదీన రూ.25వేలు జరిమానా విధించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. మోదీ డిగ్రీపై కేజ్రీవాల్​కు కావాల్సిన సమాచారం ఇవ్వాలంటూ కేంద్ర సమాచార కమిషన్ ఏడేళ్ల క్రితం ఇచ్చిన ఆదేశాలను గుజరాత్ హైకోర్టు పక్కనబెట్టింది. కేజ్రీవాల్​కు విధించిన జరిమానాను నాలుగు వారాల్లోగా గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని స్పష్టం చేసింది.

కేసు నేపథ్యం: 2016 ఏప్రిల్​లో అరవింద్​ కేజ్రీవాల్.. కేంద్ర సమాచార కమిషన్​ ఛైర్మన్​కు ఓ లేఖ రాశారు. అందులో ఆర్టీఐ చట్టం ప్రకారం మోదీ విద్యార్హతలకు సంబంధించి వివరాలు వెల్లడించాలని కేజ్రీవాల్​ కోరారు. తన గురించి ప్రభుత్వ రికార్డులు వెల్లడించేందుకు ఏం అభ్యంతరం లేదన్న కేజ్రీవాల్​.. మోదీ విద్యార్హతల సమాచారాన్ని కమిషన్ ఎందుకు దాచిపెట్టాలని అనుకుంటోందని ప్రశ్నించారు.

దీనిపై స్పందించిన అప్పటి కేంద్ర సమాచార కమిషన్​ ఛైర్మన్​ ఎమ్​ శ్రీధర్ ఆచార్యులు.. గుజరాత్ యూనివర్సిటీకి, దిల్లీ యూనివర్సిటీకి ఆదేశాలు జారీచేశారు. మోదీ విద్యార్హతలకు సంబంధించిన రికార్డులను కేజ్రీవాల్‌కు ఇవ్వాలని సూచించారు. కేంద్ర సమాచార కమిషన్​ ఛైర్మన్​ ఎమ్​ శ్రీధర్ ఆచార్యులు ఆదేశాలపై.. గుజరాత్ యూనివర్సిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై గుజరాత్​ హైకోర్టును ఆశ్రయించింది. కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేంద్ర సమాచార కమిషన్​ ఆదేశాలపై స్టే విధించింది. ఇప్పుడు ఆ ఆదేశాల్ని పక్కనబెడుతూ.. కేజ్రీవాల్​కు జరిమానా విధించింది.

ఇవీ చదవండి:

'ఎన్​ఆర్​సీ కంటే ముందు మోదీ డిగ్రీ పట్టా చూపించాలి'

మంత్రి కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ ట్వీట్ వార్

ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం.. కేటీఆర్​, బండి సంజయ్​ ట్వీట్​ల వార్​

Last Updated :Apr 4, 2023, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.