ETV Bharat / state

Minister KTR: 'ప్రభుత్వం వైద్యారోగ్య శాఖకు అధిక ప్రాధాన్యత కల్పిస్తోంది'

author img

By

Published : Jan 19, 2022, 11:16 AM IST

Minister KTR Tweet: వైద్య, ఆరోగ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తోందని మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. గతంలో దయనీయంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల ఫోటోలను, ప్రస్తుతం ప్రభుత్వం నిర్మించిన ఆస్పత్రులను జత చేసి... మంత్రి హరీశ్​ రావుకు అభినందనలు తెలియజేశారు.

Minister KTR Tweet
మంత్రి కేటీఆర్

Minister KTR Tweet: రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. బాలానగర్, కోయిల్ కొండ ప్రాంతాలలో గతంలో దయనీయంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల ఫోటోలను, ప్రస్తుతం ప్రభుత్వం నిర్మించిన ఆసుపత్రుల చిత్రాలను జత చేసి మంత్రి కేటీఆర్ ట్విటర్​లో షేర్ చేశారు.

ఈ కట్టడాలు చూస్తుంటే ప్రభుత్వం వైద్యశాఖకు ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్​రావుకు, నారాయణపేట్ ఎమ్మెల్యేకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలియజేశారు.

ఇదీ చూడండి: Govt employees: ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు.. త్వరలో ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.