ETV Bharat / state

కేంద్ర మంత్రి రాజ్​నాథ్​సింగ్​కు మంత్రి కేటీఆర్ లేఖ

author img

By

Published : Jul 15, 2021, 5:45 PM IST

Updated : Jul 15, 2021, 8:01 PM IST

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. నగరంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్​లో రహదారులను మూసివేయొద్దని విజ్ణప్తి చేశారు. రోడ్ల మూసివేతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి రాజ్​నాథ్​సింగ్​కు మంత్రి కేటీఆర్ లేఖ
కేంద్ర మంత్రి రాజ్​నాథ్​సింగ్​కు మంత్రి కేటీఆర్ లేఖ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలటరీ అథారిటీ ఇష్టారీతిన రోడ్లను మూసివేయడం పట్ల మంత్రి కేటీఆర్​ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొవిడ్ కేసుల పేరుతో దారులను ఇష్టారీతిన మూసివేయటం వల్ల లక్షలాది మంది నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​కు లేఖ రాశారు. కంటోన్మెంట్ రోడ్లు మూసివేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు.

లోకల్ మిలటరీ అథారిటీ స్థానిక కంటోన్మెంట్ బోర్డుకి సంబంధం లేకుండా రోడ్ల మూసివేతకు పాల్పడుతోందని, కంటోన్మెంట్ యాక్ట్​లో ఉన్న సెక్షన్ 258కి ఇది పూర్తి విరుద్ధమని కేటీఆర్​ గుర్తు చేశారు. కంటోన్మెంట్ బోర్డు చట్టంలో పేర్కొన్న మార్గదర్శకాల మేరకు మాత్రమే రోడ్డు మూసివేసే ప్రక్రియ ఉండాలన్నారు. అయితే ఇష్టారీతిన అత్యంత చిన్న చిన్న కారణాలు చూపి పదే పదే రోడ్ల మూసివేస్తున్నారని ఆరోపించారు.

  • Request intervention of @DefenceMinIndia @rajnathsingh ji in giving directions to the Local Military Authorities of Secunderabad Cantonment Board for restraint in unauthorized blockage of roads.This is affecting millions of citizens dwelling in north & north-eastern parts of Hyd pic.twitter.com/wo4MsRV9ZH

    — KTR (@KTRTRS) July 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సికింద్రాబాద్ లోకల్ మిలటరీ అథారిటీ పరిధిలో ఉన్న కీలకమైన అలహాబాద్ గేట్ రోడ్డు, గాఫ్ రోడ్డు, వెల్లింగ్టన్ రోడ్డు, ఆర్డినెన్స్ రోడ్​ వంటి కీలకమైన నాలుగు రోడ్లను కొవిడ్ కేసుల పేరు చెప్పి అధికారులు మూసివేశారని కేటీఆర్​ పేర్కొన్నారు. పదే పదే ఇలా రోడ్లను మూసివేయడంతో నగరవాసులు అనేక కిలోమీటర్లు అదనంగా తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు చాలా తగ్గాయని, అయినప్పటికీ కొవిడ్​ పేరు చెప్పి తాజాగా మరోసారి రోడ్ల మూసివేతకు పాల్పడడం అత్యంత బాధాకరమని అన్నారు.

స్థానిక మిలటరీ అధికారుల పరిధిలో ఉన్న రోడ్లపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు ఇప్పటికే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కార్యదర్శితో వీడియో కాన్ఫరెన్స్ జరిగిందని.. ఆ సమావేశంలో ఇందుకు సూచనప్రాయంగా అంగీకరించారని కేటీఆర్​ తెలిపారు. ఆ దిశగా రక్షణ శాఖ తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని అన్నారు. రోడ్లు మూసివేయకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చి నగరవాసులకు ఊరట కల్పించాలని కేటీఆర్ కోరారు.

ఇదీ చూడండి: 50 వేల ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ: సీఎం కేసీఆర్

Last Updated :Jul 15, 2021, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.